తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణ పనుల ముందున్న సవాళ్లను పరిష్కరించడానికి కీలకమైన సమావేశం సోమవారం (నేడు) జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సూచనల మేరకు, ఢిల్లీ నుండి ప్రత్యేక బృందం ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.
సమావేశంలో ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణానికి అవాంతరాలు కలిగిస్తున్న అంశాలను చర్చించనున్నారు. ఇందులో భూసేకరణ సమస్యలు, అటవీ అనుమతులు, యుటిలిటీ ఛార్జీలు, స్థానిక ప్రాంతీయ భవనాలు, విద్యుత్, నీటి సరఫరా వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తాయి. ఈ అంశాలపై సమగ్రమైన పరిష్కారం కనుగొనడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంగా పనిచేస్తున్నారు.
భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం
సమస్యల పరిష్కారం కోసం, గత మూడు రోజులుగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, అటవీ, విద్యుత్ శాఖల అధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా కేంద్ర అధికారులు కూడా ఈ నెల 17న అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టు (National Highways Projects) లపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేశారు.ఈ సమావేశంలో హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు,
ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే (Greenfield Expressway) వంటి భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్-అమరావతి ఎక్స్ప్రెస్ వేపై సీఎం రేవంత్ గడ్కరీని కలిశారు. విభజన హామీల్లో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య 12 వరుసల హైవే నిర్మించాలని సీఎం కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

రహదారులపై కూడా సమావేశంలో చర్చ
నాగ్పూర్-విజయవాడ కారిడార్ (NH-163G): ఈ కారిడార్లోని మంచిర్యాల- వరంగల్- ఖమ్మం- విజయవాడ సెక్షన్లో భూసేకరణలో ఇబ్బందులున్నాయి.ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల రోడ్డు (NH-63): ఈ రహదారి భూసేకరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.హైదరాబాద్- మన్నెగూడ సెక్షన్ (NH-163): ఈ రోడ్డులో పెద్ద సంఖ్యలో ఉన్న మర్రి చెట్ల కారణంగా కోర్టు కేసుల వల్ల పనులు నిలిచిపోయాయి.
జగిత్యాల-కరీంనగర్ (NH-563), హైదరాబాద్- శ్రీశైలం (NH-765) రహదారులతో పాటు, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన (NH-167K), హైదరాబాద్-రాయ్పూర్ రోడ్డు, బెల్లంపల్లి-గడ్చిరోలి-దుర్గ్ గ్రీన్ఫీల్డ్ రహదారులపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, భూపాలపల్లి,
ఈ సమావేశంలో వీటికి ఒక స్పష్టమైన పరిష్కారం
మహబూబాబాద్, నాగర్కర్నూల్, కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాల్లో రహదారుల విస్తరణలో అటవీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమావేశంలో వీటికి ఒక స్పష్టమైన పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ సమావేశం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిరి, పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: