ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, (YS Sharmila) కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన ఈసీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభావంలో పనిచేస్తోందని, బీజేపీకి ఎన్నికల ఏజెంట్లా మారిపోయిందని ఆమె ఆరోపించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన సమయంలో కేంద్ర సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ఏజెన్సీలు కూడా ప్రధాని నియంత్రణలో పనిచేస్తున్నాయన్న ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్న ఈ పరిస్థితిని దేశ ప్రజలముందు కాంగ్రెస్ పార్టీ వెలికి తీస్తోందని, రాహుల్ గాంధీ నడిపిస్తున్న ఉద్యమం దానికి నిదర్శనమని షర్మిల స్పష్టం చేశారు.

AP
ఓట్లు చేరడం వెనుక కుట్ర దాగి ఉందని
అలాగే, కర్ణాటకలో లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు నమోదు కావడం, మహారాష్ట్రలో ఒక్క గంటలోనే అనూహ్యంగా లక్షలాది ఓట్లు పోలింగ్ (Polling) కావడం వంటి సంఘటనలు ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆమె ఉదాహరణలు ఇచ్చారు. ఎన్నికలకు ఐదు నెలల ముందే కోట్లకొద్దీ కొత్త ఓట్లు చేరడం వెనుక కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేక ఓట్లను తొలగించడం, వారికి అనుకూలంగా నకిలీ ఓట్లు చేర్చడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆమె హెచ్చరించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress Patry) దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టిందని, భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు రాష్ట్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని షర్మిల పిలుపునిచ్చారు.
వైఎస్ షర్మిల ఎన్నికల సంఘంపై ఏ ఆరోపణలు చేశారు?
A1: ప్రధానమంత్రి మోదీ నియంత్రణలో ఎన్నికల సంఘం పనిచేస్తోందని, బీజేపీకి ఎన్నికల ఏజెంట్లా వ్యవహరిస్తోందని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇతర కేంద్ర సంస్థల పనితీరుపై ఆమె ఏమని అన్నారు?
A2: సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు కూడా మోదీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నాయని, ఇవి స్వతంత్రంగా లేవని షర్మిల పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: