Trump-ఇటీవల డల్లాస్ లో భారతీయుడు నాగమల్లయ్య దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ సంఘటలనతో అక్రమ వలసదారుల సమస్యపై ఆయన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ‘అక్రమ వలసదారుల పట్ల మృదువుగా వ్యవహరించే రోజులు పోయాయి’ అని అన్నారు. నేరస్థులైన అక్రమ వలసదారులపై జాలి చూపించే యుగం ముగిసిందని.. అమెరికా వారు వీడాల్సిన టైం దగ్గరపడిందని ట్రంప్ అన్నారు. ఈనెల పదవ తేదీన టెక్సాస్ లోని ఓ మోటెల్ లో బాధితుడిపై అతని భార్య, కొడుకు సమక్షంలో దాడి చేసి, తల నరికి చంపిన విషయం విధితమే. నిందితుడు, 38ఏళ్ల యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్, అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న క్యూబా జాతీయుడు.

జో బైడెన్ పై ట్రంప్ విమర్శలు
గతంలో జో బైడెన్(Joe Biden) ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినెజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందని ట్రంప్ విమర్శించారు. అతడికి నేరచరిత్ర ఉన్నా నివాసానికి అనుమతించారని ధ్వజమెత్తారు. ‘ఈ వ్యక్తి క్రూరమైన నేరాలకు పాల్పడి గతంలోనే అరెస్టయ్యాడు. చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనం తదితర కేసులు అతడిపై నమోదయ్యాయి. అలాంటి వ్యక్తిని బైడెన్ మా గడ్డ మీదకు తీసుకొచ్చారు. అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోను అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో అక్రమ వలసలపై కఠినచర్యలు: ట్రంప్
అక్రమ వలసలు కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా నొక్కి చెప్పారు. ఈ సంఘటన భవిష్యత్తులో అక్రమ వలసల(Illegal immigration)పై అమెరికా విధానాలు మరింత కఠినతరం కావడానికి దారితీసే అవకాశం ఉందన్నారు. అక్రమ వలసలను అరికట్టేందుకు సరిహద్దు గోడను నిర్మించడంతోపాటు, భద్రతా వ్యవస్థకు పటిష్టం చేశానని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో ఏ సంఘటన చోటు చేసుకుంది?
అమెరికాలో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు.
ఈ ఘటనపై ట్రంప్ ఎలా స్పందించారు?
అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: