Guntur-గుంటూరు జిల్లా తురకపాలెంలో వెలుగు చూసిన మెలియాయిడోసిస్ కేసులు ఇప్పుడు చెబ్రోలు మండలంలోనూ భయాందోళన కలిగిస్తున్నాయి. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి(Challa Seetarami Reddy)మృతి చెందడంతో వైద్య శాఖ మరింత అప్రమత్తమైంది. ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రికి వెళ్లిన తొమ్మిది మందిలో నలుగురిలో కొకై రకం బ్యాక్టీరియా గుర్తించబడింది. బాధితులకు పూర్తి స్థాయి పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఆశా వర్కర్ సులోచన మరణం అనుమానాస్పదం
సెప్టెంబర్ 12న చెబ్రోలు గ్రామానికి చెందిన ఆశా వర్కర్ సులోచన (45) జ్వరం(Fever), ఉబ్బసం వంటి లక్షణాలతో మృతి చెందారు. ఆమె మరణంపై అధికారులు నివేదికలు పరిశీలిస్తున్నారు. గ్రామంలో జ్వరం బారిన పడినవారికి చెబ్రోలు పీహెచ్సీలో చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులు కోలుకుంటున్నారని కూడా పేర్కొన్నారు.
వైద్యుల నివేదికలు: స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్
చెబ్రోలు పీహెచ్సీ వైద్యురాలు డా. ఊర్మిళ వెల్లడించిన వివరాల ప్రకారం, తొమ్మిది మందికి బ్లడ్ కల్చర్ టెస్టులు చేయగా ఐదుగురిలో స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్గా తేలింది. మరో కేసులో మెలియాయిడోసిస్ అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మెలియాయిడోసిస్ అంటే ఏమిటి?
మెలియాయిడోసిస్ అనేది బర్కోల్డీరియా ప్సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ప్రమాదకరమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.
లక్షణాలు ఏవి?
జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు, శరీరంలో పుండ్లు, అలసట.
Read hindi news: hindi.vaartha.com
Read also: