ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి మంజూరైన మధ్యంతర బెయిల్ ముగియడంతో తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)లో చేరారు.
కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 లోపు హాజరు
విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 6వ తేదీన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు జారీ చేసిన స్పష్టమైన ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటల లోపు తిరిగి జైలుకు హాజరుకావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా మిథున్ రెడ్డి (Mithun Reddy)నిన్న సాయంత్రం జైలుకు చేరుకున్నారు.
గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం
మిథున్ రెడ్డి తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. అనంతరం మార్గాని ఎస్టేట్స్లోని వైసీపీ నగర కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ మాజీ ఎంపీ భరత్రామ్ స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు.
పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు – చివరికి రద్దు
ఈ రోజు మిథున్ రెడ్డి పుట్టినరోజు కావడంతో రాజమహేంద్రవరం జైలుకు సమీపంలోని ఓ హోటల్లో వేడుకలకు ఏర్పాట్లు చేసినా, కోర్టు ఆదేశాల ప్రకారం సమయపాలన కోసం ఆ వేడుకలను చివరి నిమిషంలో రద్దు చేశారు. హోటల్ వద్దకు వచ్చిన మిథున్ రెడ్డి తమ అభిమానులు, కార్యకర్తలను కలిసి అనంతరం జైలు చొరబడిపోయారు.
మిథున్ రెడ్డి ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితులలో ఒకరుగా అరెస్టయ్యారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. మిథున్ రెడ్డి తాత్కాలికంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని పొందినా, కోర్టు విధించిన పరిమితులను పాటిస్తూ తిరిగి జైలుకు వెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: