ప్రముఖ నటి హన్సిక మోత్వానీకి బాంబే హైకోర్టు తీవ్ర ఎదురుదెబ్బ (Bombay High Court gives a major setback to Hansika Motwani) ఇచ్చింది. తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ 2020లో వివాహం చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్నా, కొద్దికాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చివరకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముస్కాన్ తన భర్తతో పాటు, హన్సిక మరియు ఆమె తల్లిపై గృహహింస కేసు (Domestic violence case) నమోదు చేశారు.
ముస్కాన్ ఆరోపణలు
తనను అత్తింటివారు తీవ్రంగా వేధించారని ముస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హన్సిక తనపై ఒత్తిడి తెచ్చి రూ.20 లక్షలు నగదు, విలువైన బహుమతులు ఇవ్వాలని బలవంతపెట్టిందని ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హన్సికతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో హన్సిక మరియు ఆమె తల్లికి సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం వారు కేసు రద్దు చేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో ముస్కాన్కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
హన్సిక వాదనలు
తనపై ముస్కాన్ కక్షతో కేసు పెట్టిందని హన్సిక పేర్కొన్నారు. పెళ్లి సమయంలో తన సోదరుడు వెడ్డింగ్ ప్లానర్కు రూ.27 లక్షలు ఖర్చు చేశాడని చెప్పారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన తర్వాతే ఈ కేసు పెట్టారని ఆమె వాదించారు. ఇంకా ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని జేమ్స్ తిరిగి చెల్లించలేదని పేర్కొన్నారు.ముస్కాన్తో పెళ్లైన కొద్దిరోజులకే ఆమె ప్రవర్తనలో సమస్యలు మొదలయ్యాయని ప్రశాంత్ వాదించాడు. తాను తీవ్రంగా వేధింపులు ఎదుర్కొన్నానని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. కక్షతోనే తన కుటుంబంపై కేసు పెట్టిందని ఆరోపించాడు.
హైకోర్టు నిర్ణయం
ఇటీవల విచారణ ముగిసిన అనంతరం హన్సిక దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేసు కొనసాగుతుందని స్పష్టమైంది. ఈ పరిణామంతో హన్సికకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హన్సిక మోత్వానీ కేసు ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. కోర్టు తుది తీర్పు ఏ దిశగా ఉంటుందో చూడాలి. కానీ ఈ కేసు హన్సిక వ్యక్తిగత జీవితంపై ముద్ర వేసినట్టే కనిపిస్తోంది.
Read Also :