బదలీ అయిన ఇఒ శ్యామలరావు ఉద్వేగం
తిరుమల : ధార్మికసంస్థ టిటిడి (TTD) లో పనిచేసే అవకాశం భాగ్యం కలిగిందని, 14నెలల కాలంలో సంస్కరణలతో అనేక విషయాలపై మెరుగైన సేవలందించేదిశగా చర్యలు తీసుకున్నామని అయిన టిటిడి ఇఒ జె.శ్యామలరావు (J. Shyamala Rao) అన్నారు. తనకు విధి నిర్వహణలో అన్ని విధాలా సహకరిచించిన అధికారులు, ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో లడ్డుప్రసాదాల నాణ్యతలో, అన్నప్రసాదాల రుచినాణ్యతలో సంస్కరణలు తీసుకువచ్చామని ఉద్వేగభరితంతో తెలిపారు.

లడ్డూల నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు
వచ్చే 25 ఏళ్ళపాటు స్వామివారి అన్నప్రసాదం, లడ్డూల నాణ్యత (Quality of brownies) లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. చేపట్టిన సంస్కరణలతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటం ఒక అనుభూతిగా మిగిలిపోతుందన్నారు. బదిలీ అయిన శ్యామలరావు బుధవారం ఉదయం కుటుంబంతో కలసి ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం శ్రీవారి చిత్రపటం బహుకరించారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: