తిరుమల :అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఏడుకొండల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు (Salakatla Brahmotsavam) బ్రహ్మాండంగా ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. స్వామివారి వాహనసేవలను విజయవంతం చేయడం, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ మాఢవీధుల్లో, ఆలయుం ముందు, వాహనమండపం ప్రాంతాల్లో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దడం, బారీకేడ్లు, గ్యాలరీలు ఏర్పాటు, బ్రహ్మరథం మరమ్మతులు, గొల్లమండపం వద్ద మలయప్పస్వామి చిత్రమాలిక (Malayappaswamy Chitramalika) కు రంగులు వేయడం వంటి పనులు చేస్తున్నారు.

ఆలయం ముందు భక్తులకు రోజువారీగా సేవలపై
ఆలయం ముందు భక్తులకు రోజువారీగా సేవలపై సమీక్షించుకునేందుకు వీలుగా టిటిడి, విజిలెన్స్, పోలీసుశాఖల శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. అన్ని విభాగాలను టిటిడి (TTD) అదనపు ఈఓ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి ఉత్తేజపరిచి పర్యవేక్షిస్తున్నారు. 24వ తేదీ నుండి మొదలుకానున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టంగా ధ్వజారోహణం జరిగే రోజు సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) తిరుమలకు వస్తుండటం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపధ్యంలో అదనపు ఆకర్షణలుగా కటౌట్లు, సెట్టింగ్లు సిద్దమవుతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: