తన తాజా సినిమా ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) ప్రమోషన్లో భాగంగా యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చలనచిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. పరిశ్రమలోని వ్యక్తిగత సంబంధాలు, స్నేహితులు, గురించి ఆయన తన నిజాయితీ గల అభిప్రాయాలను వెల్లడి చేశారు.
“ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే!” – ఇండస్ట్రీ నిజాలు బయటపెట్టిన హీరో
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “చలనచిత్ర పరిశ్రమ అనేది ఓ ఆకలితో ఉన్న సముద్రంలా ఉంటుంది. ఎవరి కోసం ఎవరు ఇక్కడ ఉండరు. ఎవరి ప్రయోజనం వాళ్లది. మనవాళ్లు అనుకునే వారు కూడా అవసరమైనప్పుడు దూరమవుతారు,” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, “ఇక్కడ స్నేహితులున్నా, అవి బయట ఉన్న సంబంధాల్లా స్వచ్ఛంగా ఉండవు. ముందు ఒకలా మాట్లడతారు, మనం వెళ్లాక వేరేలా ప్రవర్తిస్తారు,” అంటూ బెల్లంకొండ సిన్సియర్గా స్పందించారు.

“నేను గాసిప్స్ వినను, మాట్లాడను” – వ్యక్తిత్వం గురించి క్లారిటీ
తన వ్యక్తిగత ధోరణిపై మాట్లాడుతూ, “నేను ఓపెన్గా ఉండే మనిషిని. గాసిప్స్ వినడం, మాట్లాడడం నాకు అలవాటు లేదు. ఎవరైనా నన్ను బాధపెడితే, నేరుగా వాళ్ల ముఖం మీదే చెప్తా. అలాగే, నేనేనైనా తప్పు చేస్తే, వెంటనే ఒప్పుకుంటా” అన్నారు.
మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్కి వస్తారు – సినిమా మీద నమ్మకం
ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. “కథ బలంగా ఉంటే, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. మా ‘కిష్కింధపురి’ చిత్రం అలా తీర్చిదిద్దిన సినిమా. కథనం చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఫోన్ చూసే టైమ్ కూడా ఉండదు,” అని విశ్వాసంగా చెప్పారు.
విఎఫ్ఎక్స్, సంగీతమే ప్రధాన ఆకర్షణలు
దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి (Kaushik Pegallapati)కథపై ఎంతో శ్రమించి రూపొందించిన ఈ చిత్రంలో, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి అంశాలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని బెల్లంకొండ వివరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ అయ్యేలా సినిమా రూపొందించబడిందని తెలిపారు.
సెప్టెంబర్ 12న ‘కిష్కింధపురి’ విడుదల
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా మీద అంచనాలు పెరిగాయి.
Read hindi news:hindi.vaartha.com
read also: