War-పహల్గాం ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో అన్నివిధాలుగా భారత్ దే పైచేయి అయ్యింది. అంతేకాదు మనదేశ యుద్ధ సామర్థ్యం ప్రపంచదేశాలకు తెలియవచ్చింది. దీనిపై భారత ఆర్మీ ఛీప్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ లమధ్య యుద్ధం ముగియలేదని అన్నారు. పహల్గాం దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మే 10తో ముగియలేదని తర్వాత చాలాకాలం పాటూ కొనసాగిందని తెలిపారు. ఇప్పటికీ కూడా ఎల్వోసీ దగ్గర వార్ జరుగుతూనే ఉందని ద్వివేది పేర్కొన్నారు. దీనికి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయాలన్నీ బయట కూడా చెప్పలేమని అన్నారు.

సరిహద్దులో పోరాటం సాగుతూనే ఉంది
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో కొనసాగుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ నియంత్రణ రేఖ వెంబడి ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటు చర్యే అవుతుందని ద్వివేది అన్నారు. పాక్ మద్దతు గల ఉగ్రవాదులు ఇంకా రెచ్చి పోతూనే ఉన్నారని సరిహద్దులో చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ముగిసి చాలాకాలం కాలేదు కాబట్టి, ఎల్దసి పరిస్థితిపై దాని ప్రభావం గురించి వ్యాఖ్యానించడం అంత సబబు కాదని ద్వివేది పేర్కొన్నారు. ఎంతోమంది ఉగ్రవాదులను ఇప్పటికే భారత ఆర్మీ బట్టుబెట్టిందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను, జీఎస్టీ మార్పులను జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వాగతించారు. ఈ సంస్కరణలు రక్షణ కారిడార్లను బలోపేతం చేస్తాయని, ఈ రంగంలో చిన్న సంస్థల నుండి ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్స హిస్తాయని అన్నారు.
ఆయన పాకిస్తాన్పై ఏమి వ్యాఖ్యానించారు?
ఆయన ప్రకారం, పాకిస్తాన్తో యుద్ధం పూర్తిగా ఆగిపోలేదని, ఇంకా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో వచ్చాయి?
సరిహద్దు భద్రత, ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
Read hindi news : hindi.vaartha.com
Read also: