చండూరు రూరల్ Crime : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగుడికి కోర్టు 22 ఏళ్ళ జైలుశిక్షతో పాటు 35వేల జరిమాన విధించిన ఘటన మండల పరిధిలో దోనిపాముల గ్రామంలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర (SP Sarath Chandra) పవర్ తెలిపిన వివరాల ప్రకారం చండూరు మండలంలో గల దోనిపాముల గ్రామానికి చెందిన తిప్పర్తి యాదయ్య తండ్రి లింగయ్య, ఒక మైనర్ బాలికపై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడటం జరిగింది బాధితురాలు తల్లి తేది 18 /12/2016 న ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుడిపైన నసీఆర్నెం:139/2016 ఎస్సీ. పీఓసీఎస్ నెం : 214/2018 యూ/ఎస్ 452,506,376(1)(ఎన్) ఐపీసీ సెక్షన్ 5(హెచ్) ఆర్/డబ్ల్యూ 6 ఆఫ్ ఫోక్సో యాక్ట్ 2012 చండూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా గురువారం రెండో అడిష నల్ కమ్ ఎస్సీ ఎస్టీ కోర్టు, అత్యాచారం, ఫోక్సో కేసుల కోర్ట్ నిందితునికి దోషిగా నిర్ధారించి, 1) సెక్షన్ ఐపీసీ ఫోక్సో చట్టం (సెక్షన్ 3 ఆర్/డబ్ల్యూ 4 ఆఫ్ ఫోక్సో యాక్ట్ 2012) ప్రకారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా, ఐపీసీ సెక్షన్ 4521 సంవత్సరం కారాగార శిక్ష మరియు రూ.5,000 జరినామ, ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ ఇంటిమిడేషన్)కు గాను 1 సంవత్సరపు కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించగా మొత్తం కలిపి 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (Severe imprisonment) రూ.35,000/జారీనామా బాధితురాలికి రూ.10 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీరు వెలు వడించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవడా తెలిపారు.

నిందితుడి శిక్షలో కీలక పాత్ర పోషించిన అధికారులకు ఎస్పీ అభినందనలు
ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన సీఐ రమేష్ కుమార్, ఎస్సై భాస్కర్రెడ్డి అలాగే ప్రాసెకూ షన్కు సహకరించిన నల్లగొండ డి.ఎస్.పి కె. శివరాం రెడ్డి, చండూరు సిఐ ఆదిరెడ్డి, యస్.ఐ నర్సింగ్ వెంకన్న, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, దిదీవీ రామాంజనేయులు, లైజన్ అధికారులు, లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె. కల్పన, శి. నరేందర్, వి. మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
నిందితుడికి కోర్టు మొత్తం ఎంత కాలం జైలుశిక్ష విధించింది?
కోర్టు నిందితుడికి మొత్తం 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
బాధితురాలికి ఎంత పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది?
బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని కోర్టు ఆదేశించింది.
Read hindi news : hindi.vaartha.com
Read also :