గుంటూరు Remote village : కూలీనాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బడుగుజీవుల పాలిట అంతుచిక్కని మహమ్మారి వెంటాడుతోంది. అయిదు నెలల క్రితం ఆనందంతో జీవనం సాగిస్తున్న ఆ ప్రజానీకం ఒక్కసారిగా కబళిస్తున్న ఈ వింత మహమ్మారితో ఒక్క సారిగా కకావికలమైంది. కొండ రాళ్లు కొట్టుకుని, రెక్కలు పిండి చేసి పూట గడిపూ ఆ కుటుంబాలను ఈ మహమ్మారి 5 నెలలుగా వెంటాడుతూ తీరని మిగులుస్తోంది. ఏ మాయదారి జబ్బో కానీ… తెలుసుకునే లోపే ఆ బడుగు జీవుల్లో 28 మంది మృత్యువాత పడటం కలచివేస్తోంది. బతుకుజీవుడా.. అంటూ ఆ ప్రజలు ఇపుడు భయాం దోళనలకు గురవుతూ రాష్ట్ర ప్రభుత్వ వైద్యసాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
తురకపాలెం గ్రామంలో విషాదం
అయిదు నెలలుగా బతుకులు జీవచ్ఛవాలతో మారిపోతున్న గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామ ప్రజలు ఈ మహమ్మారి బారిన పడుతూ అసులు బారుతు న్నారు. ఒకరెంట ఒకరు మృత్యుఒడిలోకి చేరుతుండటంతో రేపు ఎవరో అంటూ విషాధ ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రూరల్ మండలం పరిధిలోని తురకపాలెంలో అంతుచిక్కని మహమ్మారి వ్యాధి వెంటాడుతోంది. అయిదు నెలల్లోనే…. 28 మంది మృత్యుబారిన పడ్డారు. దీంతో నిత్యం ఆ గ్రామంలో భయం నీడ వెంటాడుతోంది. వైద్య రంగానికి కూడా సవాల్గా మారిన ఈ మహమ్మారి వ్యాధి కనుగొనులోపే మరెంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందో.. అంటూ భయాందోళనకు గురవుతున్నారు.
వ్యాధి లక్షణాలు మరియు జాగ్రత్తలు
కొంత కాలం క్రితం అస్వస్థతకు గురైన ఇద్దరు వ్యక్తుల నుంచి రక్తపరీక్షలు (blood test) చేయగా, వారికి ఇన్ఫెక్షన్ మెలియాయి దోసిస్… అనే భయంకరమైన వ్యాధి సోకినట్టు తొలుత గుర్తించారు. కలుషితమైన నేల, నీటితో చర్మగాయాల ద్వారా గాలిలో వచ్చే కణాలను పీల్చటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిచ్ఛవచ్చు. కలు ప్రజలు ఈ వ్యాధి భారిన పడినట్టు వైద్యాధికారులు భావిస్తున్నారు. అరుదుగా ఉన్నప్పటికీ శరీర ద్రవాలతో బహిరంగ గాయాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మిలిలోయి డ్రోసిస్ (infection) ప్రజల మధ్య వ్యాపిస్తునందని అంటున్నారు.
తురకపాలెం గ్రామంలో ఈ మహమ్మారి ఎంత కాలంగా వ్యాపిస్తోంది?
ఈ మహమ్మారి సుమారు అయిదు నెలలుగా గ్రామ ప్రజలను వేధిస్తోంది.
ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?
కలుషిత నేల, నీరు, చర్మగాయాల ద్వారా గాలి కణాలు పీల్చడం మరియు శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం వల్ల వ్యాపిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Read also :