అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ సుంకాల విషయంలో దూకుడు ప్రదర్శించారు. రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన పలుమార్లు వాణిజ్య విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కారణమవుతున్నారు. తాజాగా భారత్, చైనా, బ్రెజిల్లపై టారిఫ్ల అంశంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.భారత్ అమెరికాపై భారీ సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ సుంకాలతో (With India tariffs) మమ్మల్ని చంపేస్తోంది” అంటూ బహిరంగ వేదికపై విమర్శించారు. భారత దిగుమతులపై 50 శాతం వరకు టారిఫ్లు ఉండటం న్యాయమని ఆయన మరోసారి సమర్థించారు. అయితే అమెరికా వస్తువులపై టారిఫ్లు ఉండవని భారత్ అంగీకరించిందని కూడా తెలిపారు.

చైనా, బ్రెజిల్ కూడా విమర్శలపాలే
ట్రంప్ మాటల్లో చైనా కూడా అమెరికాను సుంకాలతో నలుపేస్తోందని స్పష్టంగా వినిపించింది. బ్రెజిల్ కూడా అదే దారిలో నడుస్తోందని ఆరోపించారు. మాపై అనేక దేశాలు సుంకాలు విధిస్తున్నాయి. కానీ వారందరికంటే ఎక్కువగా భారత్ చేస్తున్నది అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.స్కాట్ జెన్నింగ్స్ రేడియో షోలో మాట్లాడుతూ ట్రంప్ టారిఫ్లపై తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. నన్ను తప్ప ఎవరూ సుంకాల అసలు భారం అర్థం చేసుకోలేరు. నేను తీసుకున్న చర్యల వల్లే దేశాలు వెనక్కి తగ్గుతున్నాయి. లేకపోతే వారు తగ్గేవారు కాదు అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా టారిఫ్లపై న్యాయస్థానం వ్యాఖ్యలు
ఇక అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు అక్రమమని ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ స్పందించారు. ఆ కేసు వెనుక ఇతర దేశాల ప్రోత్సాహం ఉందని ఆయన ఆరోపించారు. అమెరికా వాణిజ్య ప్రయోజనాల రక్షణకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని ట్రంప్ పట్టుబట్టారు.సుంకాల అమలు ద్వారా అమెరికా ఆర్థికంగా మరింత బలపడుతుందని ట్రంప్ నమ్మకం వ్యక్తం చేశారు. సుంకాలు ఉండాలి. లేకపోతే మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. నేను తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి నియంత్రణలో ఉంది అని ఆయన వివరించారు.ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి వాణిజ్య యుద్ధాల చర్చకు దారితీశాయి. భారత్తో పాటు చైనా, బ్రెజిల్లను టార్గెట్ చేసిన ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో కొత్త వాదనలకు దారి తీస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్ చర్యలు అమెరికా వాణిజ్య సంబంధాలపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.
Read Also :