స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారతదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉండగా ఆమె చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జర్మనీలో (Germany) నివసిస్తున్న 82 ఏళ్ల అనితా బోస్, ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ, తన వయసు పెరుగుతున్నందున ఈ సమస్యకు త్వరగా ముగింపు రావాలని కోరారు. ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం వస్తే, తన తండ్రి అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని తప్పక అడుగుతానని తెలిపారు.
గత ప్రభుత్వ ప్రయత్నాలపై అనితా స్పందన
అనితా బోస్ మాట్లాడుతూ, గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం నేతాజీ అస్థికలను తీసుకురావడానికి ప్రయత్నించిందని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగించాలని అభిలషించారు. ఇది కేవలం తన వ్యక్తిగత కోరిక కాదని, నేతాజీ దేశానికి చెందిన మహనీయుడు కావడంతో ఈ విషయంలో త్వరిత చర్య అవసరమని (necessary) ఆమె పేర్కొన్నారు.ఈ అంశాన్ని నేను నా కొడుక్కి బాధ్యతగా ఇవ్వదలచుకోను. నా జీవితకాలంలోనే దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను” అని అనితా బోస్ భావోద్వేగంగా పేర్కొన్నారు. నేతాజీ కేవలం తన తండ్రే కాక, మొత్తం దేశానికి చెందిన నాయకుడని ఆమె గుర్తు చేశారు.

నేతాజీ మరణం – చరిత్రలో నమోదు
1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ, అంతర్జాతీయ విచారణలు నిర్ధారించాయి. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆయన స్థానిక సైనిక ఆసుపత్రిలో కన్నుమూశారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన అస్థికలు ప్రస్తుతం జపాన్లోని టోక్యోలో ఉన్న రెంకోజీ బౌద్ధ ఆలయంలో భద్రపరిచినట్లుగా విశ్వసిస్తున్నారు.
నేతాజీ అస్థికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి?
జపాన్లోని టోక్యోలో ఉన్న రెంకోజీ బౌద్ధ ఆలయంలో ఒక కలశంలో భద్రపరిచినట్లు విశ్వసిస్తున్నారు.
అనితా బోస్ ఎవరూ?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్నారు.
Read also: hindi.vaartha.com
Read also: