News Telugu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ –
“మా మధ్య బంధుత్వం మాత్రమే కాకుండా, అంతకంటే ఎక్కువ ఆత్మీయత, స్నేహబంధం ఉండేది. హరికృష్ణ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎప్పుడూ ఆప్యాయతను పంచిన గొప్ప మనిషి. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరదు” అని పేర్కొన్నారు.
హరి మామయ్యను స్మరించిన నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)కూడా తన మామయ్య హరికృష్ణ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ట్విట్టర్లో ఆయన పేర్కొంటూ –
“హరి మామయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి గౌరవపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందించారు. సినిమాల్లోనూ తన ప్రత్యేక శైలితో తెలుగు ప్రజలను అలరించారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరదు. రాజకీయ, సినీ రంగంలో చేసిన సేవలను ఈ రోజు గుర్తు చేసుకోవాలి” అని రాశారు.
ప్రజా సేవలో హరికృష్ణ పాత్ర
హరికృష్ణ సినీ నటుడిగానే కాకుండా, రాజకీయాల్లోనూ విశేష పాత్ర పోషించారు. టీడీపీ స్థాపన నుండి పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర వహించిన ఆయన, ఎన్నో పదవుల్లో ప్రజా సేవ చేశారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రజలు, అభిమానులు స్మరించుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: