हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Crime- అదనపు కట్నం కోసం భార్యను సజీవ దహనం చేసిన భర్త..ఎక్కడంటే?

Sharanya
News Telugu: Crime- అదనపు కట్నం కోసం భార్యను సజీవ దహనం చేసిన భర్త..ఎక్కడంటే?

News Telugu: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (Noida) జిల్లా సిర్సా గ్రామంలో అదనపు కట్నం కోసం ఓ మహిళను సజీవంగా దహనం చేసిన ఘటన కలకలం రేపుతోంది. 2016లో విపిన్ అనే వ్యక్తితో నిక్కీ అనే మహిళ వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చినప్పటికీ, తరువాత ఆమెను మరో రూ.35 లక్షలు తేవాలని భర్త, అత్తమామలు వేధించారు.

అక్క ఫిర్యాదు ఆధారంగా కేసు

ఈ ఘటనపై బాధితురాలి అక్క కాంచన్ ఫిర్యాదు చేసింది. ఆమె కూడా విపిన్ సోదరుడు రోహిత్‌ను వివాహం చేసుకుంది. కాంచన్ తన ఫిర్యాదులో, నిక్కీపై నిరంతర వేధింపులు జరిగాయని, ఆగస్టు 21న విపిన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆమెను దారుణంగా కొట్టి, మండే ద్రవాన్ని పోసి నిప్పంటించారని పేర్కొంది.

News Telugu
News Telugu

ఆసుపత్రిలో ప్రాణపోరాటం – మరణం

స్థానికుల సహాయంతో నిక్కీని ముందుగా సమీప ఆసుపత్రికి, తరువాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

సోషల్ మీడియాలో షాక్ ఇచ్చిన వీడియోలు

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో నిక్కీని కొడుతూ, జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లే దృశ్యాలు ఉన్నాయి. మరో వీడియోలో మంటల్లో ఉన్న నిక్కీ మెట్లపై నుంచి దిగుతున్న సన్నివేశం కనిపించింది. నిక్కీ కుమారుడు (Nicky’s son) కూడా పోలీసులకు వాంగ్మూలమిస్తూ, ‘మమ్మీ మీద ఏదో పోసి, కొట్టి, లైటర్‌తో నిప్పంటించారు’ అని చెప్పాడు.

తల్లిదండ్రుల వేదన

నిక్కీ తల్లిదండ్రులు మాట్లాడుతూ, పెళ్లి సమయంలోనే భారీగా కట్నం ఇచ్చినప్పటికీ, మరో రూ.35 లక్షల కోసం తమ కూతురిని ఇంత దారుణంగా హింసించారని వాపోయారు. అత్తమామలు తమ కూతురిని దూరం చేసి, విపిన్‌కు రెండో పెళ్లి చేయాలనే కుట్ర పన్నారని ఆరోపించారు.

పోలీసుల చర్య

ఈ ఘటనపై అదనపు డీసీపీ సుధీర్ కుమార్ మాట్లాడుతూ, బాధితురాలి అక్క కాంచన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. భర్త విపిన్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

న్యాయం కోసం ఆందోళనలు

నిక్కీ బంధువులు, గ్రామస్థులు భారీ ఆందోళనలు చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కట్న వేధింపుల దారుణతను మరోసారి బయటపెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-gas-tanker-explosion-punjab-7-dead/national/535331/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870