Restaurant Charges : ఆగస్టు 16, 2025న ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ (Devendra Kumar) ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం, ఆహార పదార్థాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు తీసుకుంటూ మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం వినియోగదారులను రెట్టింపు దోపిడీకి గురి చేయడమేనని పేర్కొంది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం (NRAI), భారత హోటళ్లు, రెస్టారెంట్ల సమాఖ్య (ఎఫ్హెచ్ఆర్ఏఐ) డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన సందర్భంగా ఈ విచారణ జరిగింది.
కోర్టు ప్రశ్నలు: ఆంబియన్స్ ధరలు, సర్వీస్ ఛార్జ్ అవసరమా?
ధర్మాసనం రెస్టారెంట్ల సంఘాలను సూటిగా ప్రశ్నిస్తూ, “కస్టమర్లకు మంచి అనుభూతి (ఆంబియన్స్) అందిస్తున్నారని చెబుతున్నారు. దానికోసం ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. రూ.20 విలువైన వాటర్ బాటిల్ను రూ.100కు అమ్ముతున్నారు. ఆ అదనపు రూ.80 ఆంబియన్స్ కోసమే కదా? మళ్లీ సర్వీస్ ఛార్జ్ ఎందుకు?” అని అడిగింది. ఆంబియన్స్ అందించడం సేవలో భాగమేనని, ప్రత్యేక ఛార్జ్ సరికాదని స్పష్టం చేసింది.

ఛార్జ్: అన్యాయమైన వాణిజ్య పద్ధతి
సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి వసూలు వినియోగదారులను బలవంతపెట్టడమేనని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. సర్వీస్ ఛార్జ్పై జీఎస్టీ కూడా చెల్లించాల్సి రావడం వల్ల రెట్టింపు భారం పడుతోందని, గత సింగిల్ జడ్జి తీర్పును గుర్తు చేసింది. కోర్టు ప్రేక్షకపాత్ర వహించలేమని తేల్చి చెప్పింది.
పిటిషన్ నేపథ్యం
సర్వీస్ ఛార్జ్ను తప్పనిసరిగా వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఆర్ఏఐ, ఎఫ్హెచ్ఆర్ఏఐ డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన సందర్భంగా ఈ విచారణ జరిగింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :