భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Indian Vice Presidential Elections) ఈసారి ఎన్నికల సమరాన్ని తలపిస్తున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షాలు తమ తమ అభ్యర్థులతో బరిలోకి దిగాయి. ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ను అధికార కూటమి ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన పాలిటిక్స్లో అనుభవంగా ఉన్నారు.ఇండియా బ్లాక్ తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. తెలంగాణకు చెందిన ఆయనకు న్యాయరంగంలో పెద్ద అనుభవం ఉంది.ఎన్డీయే గెలుపు ఖాయమన్న లెక్కలు కనిపిస్తున్నా… ఇది సాధారణ ఎన్నికలా మారింది. ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అభ్యర్థిని ప్రకటించింది.

తలపోకుండా ఎదురెళ్లకూడదన్న మంత్రం
ఒకే అభ్యర్థి ఉంటే ప్రభుత్వానికి నైతిక విజయమే. అందుకే ఇండియా కూటమి పోటీకి దిగింది. సమరాన్ని సమంగా చూపించాలన్న ఉద్దేశ్యంతో వ్యవహరిస్తోంది.ఇది ప్రతిపక్ష ఏకతాటిపై ఉన్నదీ ఒక సంకేతం. లౌకికవాద పార్టీలు కూడా మద్దతు ఇస్తే… అది వేరే సంకేతమవుతుంది.రాధాకృష్ణన్, సుదర్శన్ రెడ్డి (Radhakrishnan, Sudarshan Reddy) ఇద్దరూ దక్షిణాదివాళ్లే. ఇది ఈ ఎన్నికకు మరో మలుపు తీసుకొచ్చింది. దక్షిణాది ఓటర్లు దృష్టిలో ఇది కీలకం.
రాధాకృష్ణన్ ఎవరు?
సీపీ రాధాకృష్ణన్ 1957లో తిరుప్పూరులో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడు.1974లో జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాజకీయం ప్రారంభం.1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు.తర్వాత బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా, కాయిర్ బోర్డు ఛైర్మన్గా, గవర్నర్ పదవుల్లో ఉన్నారు.ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన, ఎన్డీయే తరపున పోటీ చేస్తున్నారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి వివరాలు
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 1946లో రంగారెడ్డి జిల్లాలో జన్మించారు.1971లో అడ్వొకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించారు.1995లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.గువాహాటి హైకోర్ట్ సీఎఫ్జెగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.2011లో పదవీ విరమణ అనంతరం గోవా లోకాయుక్తగా వ్యవహరించారు.ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం 781 ఓటర్లు ఉన్నారు.గెలవాలంటే కనీసం 391 ఓట్లు అవసరం.ఎన్డీయేకు ఇప్పటికే 432 ఓట్లు ఉన్నట్టు అంచనా.ఇండియా కూటమికి 311 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల పార్టీల దౌత్యం
జస్టిస్ రెడ్డి తెలుగువాడు కావడంతో టీడీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒడిదుడుకుల్లో పడ్డాయి.టీడీపీ ఎన్డీయేలో ఉంది కాబట్టి ఆ వైపు ఓటు వేయొచ్చు.బీఆర్ఎస్కి 4 రాజ్యసభ సభ్యులు, ఎంఐఎంకి 1 ఎంపీ ఉన్నారు.వారు ఇండియాకు ఓటు వేశా గెలుపు సాధ్యం కాదు.సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.ఈసారి ఎవరు గెలుస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.ఫలితం కచ్చితంగా దేశ రాజకీయాలపై ప్రభావం చూపించనుంది.
Read Also :