23న మహాధర్నాకి పిలుపునిచ్చిన యుఎస్ పిసి
Latest News : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన, పోరాటాలకు పిలుపునివ్వగా. ఉద్యోగ, ఉపాధ్యాయ జెఏసి నేతలు ప్రత్యేక సమావేశం (Latest News) ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలు కలిసి ఐక్యంగా ప్రభుత్వంపై జంగ్ చేయడానికి సిద్ధమయ్యాయి.
ఉద్యోగుల జేఏసీ సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయించగా..
అక్టోబర్ 12న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 14 ఉపాధ్యాయ సంఘాలు కలిపి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ఏర్పడి ఈ నెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర తమ సమస్యల పరిష్కారానికి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించాయి. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్కి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న విద్రోహదినంగా నిరసన కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం హైదరాబాద్లోని టిఎన్జివో సెంట్రల్ ఆఫీస్లో చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు అధ్వర్యంలో నిర్వహించగా 206 భాగస్వామ్య సంఘాలు పాల్గొన్నాయి.
ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల
జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించింది. సమావేశంలో ఎంప్లాయీస్ జేఏసి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, కోచైర్మన్స్ చావా రవి, వంగా రవీందర్ రెడ్డి, జి. సదానందం గౌడ్, చకినల అనిల్ కుమార్, దాస్యా నాయక్, టి. లింగారెడ్డి, మధుసూధన్ రెడ్డి, ఎం. మణిపాల్ రెడ్డి, జి. శ్రీనివాస్ రెడ్డి, జి. దామోదర్ రెడ్డి, కె. లక్ష్మయ్య, పి. కృష్ణ మూర్తి, మారెడ్డి అంజి రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎస్కె హుస్సేని (ముజీబ్), ఎ. సత్యనారాయణ, స్థిత ప్రజు, వైస్ చైర్మన్స్ చంద్ర మోహన్, నూనే శ్రీధర్, డా. నరహరి, ఎం. చంద్రశేఖర్ గౌడ్, తిప్పర్తి యాదయ్య, ఎ. సత్యనారాయణ రెడ్డి, మోహన్ నారాయణ, జి. నరసయ్య, ఉమారెడ్డి, డి. సైదులు, రాజాగంగారెడ్డి, డా. కిరణ్ కుమార్, రవీంధర్ కుమార్, డా. మార్తా రమేష్, టి. కృష్ణ మోహన్, కస్తూరి వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ కార్యదర్శి బి. శ్యామ్, ప్రచార కార్యదర్శులు పద్మావతి, మహ్మద్ అబ్దుల్లా, వైద్యనాధ్, చక్రధర్, జి.గంగాధర్, డా. ఆర్. అజయ్ కుమార్, వి.మరి యమ్మ, సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సును హైద రా బాదులో తెలుగు లలిత కళాతోరణంలో నిర్వహించనుంది.
33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టనుంది
సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్రను చేపట్టాలని జేఏసి నిర్ణయించింది. సెప్టెంబర్ 8న వరంగల్ జిల్లా, 9న కరీంనగర్ జిల్లా. 10న ఆదిలాబాద్ జిల్లా, 11న నిజాంబాద్ జిల్లా, 12న సంగారెడ్డి మెదక్ జిల్లా, 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో, 16న మహబూబ్నగర్ జిల్లా, 17న నల్లగొండ జిల్లా, 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నోటితో పలక రించి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని జేఏసి విమర్శించింది.
Read also :