हिन्दी | Epaper

Protest : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి కోరుతూ మహాధర్నా

Shravan
Protest : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి కోరుతూ మహాధర్నా

హైదరాబాద్ Protest : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ (Government) స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్సు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుఎస్పిసి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న హైదరాబాద్లోని ధర్నాచౌక్ మహాధర్నా చేపట్టనున్నట్టు యుఎస్పిసి నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను యుఎస్పిసి నేతలు సోమవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో (TS UTF state office) ఆవిష్కరించారు. అనంతరం యుఎస్పిసి నేతలు మీడి యాతో మాట్లాడారు. చావ రవి, ఎ వెంకట్ (టిఎస్ యుటిఎఫ్), ఎన్ తిరుపతి (టిపి టిఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి (డిటిఎఫ్), కొమ్ము రమేష్ (బిటిఎఫ్), ఎస్ హరికిషన్ (టిటిఎ), పై విజయకుమార్ (ఎస్సీ ఎస్టీయుయస్), పి మాణిక్ రెడ్డి, ఎ సింహాచలం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరిం చడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుం దన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదన్నారు.

ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్న డిమాండ్

నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతిరెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ న్ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలన్నారు. ఉపాధ్యాయుల, పెన్షనర్ల వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్ హెచ్యం పోస్టులను మంజూరు చేయాలని, డిఎడ్, బిఎడ్ అర్హతలున్న ప్రతియస్కీటికి పియస్ హెచ్యంగా ప్రమోషన్కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దుచేసి జిఒ 11,12ల ప్రకారం పదోన్నతులు కల్పిం చాలన్నారు. అలాగే ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు. చేయాలని డిమాండ్ చేశారు.

Protest

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా

గురుకులాల టైం టేబుల్ను సవరించాలని, కెజిబివి, మోడల్ స్కూల్స్, గిరిజన సం క్షేమ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి ప్రభుత్వానికి అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికి మంత్రులు, ఆఫీసర్ల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాక పోవడంతో గత నెలలో దశలవారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యుఎస్ పిసి నిర్ణయించిందన్నారు.జులై 23, 24, 25 తేదీల్లో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెమోరాండాలు సమర్పించామని, రెండవ దశలో ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాలు అందజేశామని అయినా ప్రభుత్వం నుంచి స్పందనలేదన్నారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా ఈ నెల23న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/cpi-cpis-4th-state-congress-begins-tomorrow/telangana/532703/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

📢 For Advertisement Booking: 98481 12870