ఇరాన్ (iran) మరోసారి హెచ్చరికలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికా, ఇజ్రాయెల్ (America, Israel) తో ఎప్పుడు అయినా యుద్ధం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన యాహ్యా రహీమ్ సఫావీ తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.”మేము శాంతి ఒప్పందాల్లో లేము. యుద్ధానికి సిద్ధమవుతున్నాం” అని సఫావీ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్లతో ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు యుద్ధమొకటి జరగొచ్చు. దానితోనే అంతం కావచ్చు” అని ఆయన హెచ్చరించారు.ఇరాన్ స్వయం బలం పెంపుపై దృష్టి పెడుతోంది. క్షిపణులు, డ్రోన్లు, సైబర్ యుద్ధం, మీడియా ప్రభావం వంటి రంగాల్లో తన శక్తిని పెంచాలని తలంపు. మేము కఠినమైన పరిస్థితులకు సిద్ధంగా ఉన్నాం,” అని సఫావీ స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ దాడులతో ఆరంభమైన ఉద్రిక్తతలు
జూన్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహ్రాన్ సమీపంలో ఉన్న ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లపై దాడి చేశాయి. ఈ దాడులతో ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలకు నష్టం జరిగిందని ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ దాడులు యుద్ధానికి కారణం కాదన్నారు. కానీ, అణు ఆయుధ ముప్పును తొలగించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇది రక్షణ ఆపరేషన్ అని వ్యాఖ్యానించారు.జూన్లో అమెరికా ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరుతో కీలక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లలోని అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. పెంటగాన్ ఈ దాడులను అధికారికంగా ధృవీకరించింది.
యుద్ధ భయాలు మళ్లీ ముసురుతున్నాయా?
ఇరాన్ తాజా హెచ్చరికలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. యుద్ధం జరిగితే దాని ప్రభావం అంతర్జాతీయంగా ఉండే అవకాశం ఉంది. చమురు మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా తడబడే అవకాశం ఉంది.ఇరాన్ అణు శక్తిని నియంత్రించాలన్నే విదేశీ పాలకుల ఉద్దేశం. కానీ, ఇరాన్ మాత్రం తన ఆత్మరక్షణకు ఇది అవసరమంటోంది. ఈ విభేదాలు సద్దుమణిగేలా కనిపించడంలేదు.ఏ దేశమైనా, యుద్ధం కన్నా శాంతే మెరుగైన పరిష్కారం. కానీ ప్రస్తుతం మధ్యప్రాచ్య పరిస్థితి చూస్తే, మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోందనే భావన ఏర్పడుతోంది.
Read Also :