జాతీయ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన రాధాకృష్ణన్ను(Radha krishnan) ఏకగ్రీవంగా గెలిపించేందుకు వైసీపీ మద్దతు కోరారు. ఇటీవల ప్రధాని మోదీపై జగన్ చేసిన పరోక్ష విమర్శల నేపథ్యంలో ఈ కాల్కి రాజకీయ ప్రాధాన్యత పెరిగింది.
ఎన్డీఏ తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును అధికారికంగా ప్రకటించిన తరువాత, ఆయన ఎన్నికను నిర్వేఘంగా పూర్తిచేయాలనే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్ను సంప్రదించడం గమనార్హం.
మద్దతు కూడగడుతున్న బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలలో
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Politics) బీజేపీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేనలతో కూటమిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ నుంచి బీజేపీ అభ్యర్థికి మద్దతు లభిస్తుందా? అనే ప్రశ్నకు ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ తీసుకోనున్న నిర్ణయంపై రాజకీయ వర్గాలు, విశ్లేషకులు ఆసక్తిగా తారసపడుతున్నారు.
ఈ ఫోన్ కాల్ రాజకీయంగా ముఖ్యమైన సందేశాలు పంపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరాజయం, రాష్ట్రంలో బీజేపీ-టిడిపి-జనసేన(Janasena) కూటమి విజయంతో జాతీయ రాజకీయాల్లో వైసీపీ ప్రభావం తగ్గిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వైసీపీతో సంబంధాలు మెరుగుపరచుకోవాలనుకుంటుందా అనే చర్చలు మొదలయ్యాయి. మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి పట్టుసాధించాలనుకునే జగన్ కూడా కేంద్రంతో దౌత్యాన్ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని అంచనాలు వెలువడుతున్నాయి. ఎలాగైనా ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సంప్రదింపులు భవిష్యత్ రాజకీయ పరిణామాలకు బీజం వేయే అవకాశం ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు?
2011లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత, ఆయన “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ”ను స్థాపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు?
2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడంతో, జగన్ 30 మే 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read hindi news: //hindi.vaartha.com/
Read also: