టెక్ ప్రపంచంలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలో భారత సంతతి ఏఐ ఇంజినీర్ (Indian-origin AI engineer) చేసిన తప్పిదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇంటెల్ కంపెనీకి చెందిన గోప్య సమాచారం మైక్రోసాఫ్ట్కి లీక్ చేసిన కేసులో కోర్టు కఠినంగా స్పందించింది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వరుణ్ గుప్తాకు అమెరికా కోర్టు $34,472 జరిమానా (Varun Gupta fined $34,472 by US court) విధించింది. అంతే కాదు, అతను రెండేళ్ల పాటు ప్రొబేషన్లో ఉండాలన్న ఆదేశం కూడా జారీ చేసింది. ఇది నిబంధనలు ఉల్లంఘించిన వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.ఓరేగాన్ లైవ్ రిపోర్ట్ ప్రకారం, 2020లో వరుణ్ ఇంటెల్ను వీడి మైక్రోసాఫ్ట్లో చేరాడు. ఆ సమయంలోనే అతను ఇంటెల్లోని కీలక డాక్యుమెంట్స్ను మైక్రోసాఫ్ట్కి పంపినట్టు తేలింది. ఇవి అతనికి ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించాయని నివేదికలు చెబుతున్నాయి.

వ్యాపార ఒప్పందాల్లో ఈ సమాచారం ఉపయోగపడింది
ఇంటెల్, మైక్రోసాఫ్ట్ మధ్య జరిగిన కొన్ని వ్యాపార చర్చల్లో కూడా ఈ లీక్ సమాచారం ఉపయోగపడిందని తెలుస్తోంది. ఇది ఊహా కాదు, నిజం అని అటార్నీ విలియమ్ నారస్ కోర్టులో తెలిపారు. వరుణ్ ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశ్యంతో సమాచారం సేకరించాడని స్పష్టం చేశారు.ప్రాసిక్యూషన్ వరుణ్కు కనీసం 8 నెలల జైలు శిక్ష విధించాలని కోరింది. కానీ అతని లాయర్లు వ్యతిరేకంగా వాదించారు. వరుణ్ ఇప్పటికే పెద్ద మూల్యం చెల్లించాడని చెప్పారు. టెక్ కెరీర్ పూర్తిగా నాశనం అయ్యిందని వివరించారు. అంతేకాక, ఇంటెల్తో $40,000 చెల్లించి సివిల్ కేసును సెటిల్ చేసినట్టు తెలిపారు.
న్యాయమూర్తి మద్యమార్గాన్ని ఎంచుకున్నారు
న్యాయమూర్తి వరుణ్ చేసిన నేరాన్ని తేలికగా తీసుకోలేదు. కానీ జైలుకు పంపడం సమంజసమేమీ కాదని భావించారు. ఆయన ఇప్పటికే తన గౌరవం కోల్పోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జైలుకు శిక్షకి బదులు జరిమానా విధించారు.కోర్టు తీర్పు ప్రకారం వరుణ్ జరిమానా చెల్లించాడు. అనంతరం తన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్కు వెళ్లిపోయినట్టు ఓరేగాన్ లైవ్ వెల్లడించింది. ఈ వ్యవహారం ఇంటర్నెట్లో విపరీతంగా చర్చనీయాంశమైంది.ఈ ఘటన టెక్ రంగంలో విశ్వసనీయత ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపించింది. ఒక్క తప్పిదం వల్ల కెరీర్, పేరుకు ఏమాత్రం ముప్పు ఏర్పడతుందో ఈ కేసు చెప్పకనే చెబుతోంది.
Read Also :