ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ వద్ద రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
క్షతగాత్రులకు చికిత్స
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 18 మంది క్షతగాత్రులను వెంటనే ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు వారి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు వెళ్తున్న బస్సును వెనక వస్తున్న మరో బస్సు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు బస్సులు తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాయి.
పోలీసులు కేసు నమోదు
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Pawan Kalyan : ప్రజా తీర్పు అంటే ఇదే : పవన్