బెయిల్ను రద్దుచేసిన సుప్రీంకోర్టు..
కన్నడ నటుడు దర్శన్ సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశంలోనే సంచలనంగా మారిన అభిమాని హత్యకేసులో (దర్శన్)
నిందితుడిగా ఉన్న దర్శన్కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ బేబీ పర్డివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్
నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంతరం
కన్నడ నటుడు దర్శన్కు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ మంజూరు, రద్దు అంశాలను మేం
పరిశీలించాం. ఈ కేసులో హైకోర్టు నిర్ణయం పూర్తిగా యాంత్రికంగా తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం వల్ల
విచారణపై ప్రభావం పడుతుంది, సాక్షులను ప్రభావితం (supreme court)చేసే అవకాశం ఉంది’ అని జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో జస్టిస్ మ
హదేవన్ రాసిన తీర్పును జస్టిస్ పర్దివాలా కొనియాడారు. నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదని ఈ తీర్పు స్పష్టం చేస్తుందని,
జస్టిస్ మహదేవన్ చాలా అద్భుతమైన తీర్పునిచ్చారు’ అని మెచ్చుకున్నారు.
సంచలనంగా మారిన కేసు
కాగా కన్నడ నటుడు దర్శన్ తన ప్రియురాలిని తన అభిమాని సోషల్మీడియా వేదికగా వేధిస్తున్నాడని అతడిని చంపించాడు దర్శన్. ఈ కేసును
తీవ్రంగా తీసుకున్న కర్ణాటక పోలీసులు కేసును లోతుగా విచారించి, అసలు నిందితులను అరెస్టుచేసారు. ఈ కేసులో దర్శన్తో పాటు అతడి
ప్రియురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. కాగా ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేయడంతో
దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు.