हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం

Sharanya
Telangana: సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం

దేశంలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో, తాజాగా విడుదలైన గణాంకాల్లో తెలంగాణ (Telangana) రాష్ట్రం అత్యధిక సైబర్ నేరాల నమోదుతో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) 2022 మధ్యంతర గణాంకాల ప్రకారం, తెలంగాణలో సైబర్ నేరాల రేటు దాదాపు 10 రెట్లు దేశ సగటును మించి ఉంది.

40.3 శాతం నేరాల రేటుతో టాప్‌కి తెలంగాణ

నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటున 4.8 శాతంగా ఉండగా, తెలంగాణ (Telangana) లో ఇది 40.3 శాతంగా నమోదైంది. ఇది ఆందోళనకరంగా మారింది. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో చాలా శాతం తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం. ఇది రాష్ట్రానికి అప్రతిష్ఠను కలిగిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో హై అలర్ట్

దక్షిణ భారతదేశంలో సైబర్ నేరాల (Cyber crimes) గణాంకాల పరంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో నేరగాళ్లు అత్యంత చురుకుగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది పోలీసు విభాగాలకు హెచ్చరికగా మారుతోంది.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?

ఇతర రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలో సైబర్ క్రైమ్ రేటు 6.6 శాతంగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 4.4, అసోంలో 4.9, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో 4.3 శాతం చొప్పున ఉంది. పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కేవలం 0.4 శాతం క్రైమ్ రేటుతో మెరుగైన స్థానంలో నిలవడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ 3.2 శాతం, పుదుచ్చేరి 3.9 శాతం క్రైమ్ రేటుతో సైబర్ నేరాలకు హాట్‌స్పాట్‌లుగా మారాయి.

ఢిల్లీలో భారీగా మోసాలు – వేల కోట్లు నష్టం

ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం, 2024లో మాత్రమే రూ. 817 కోట్లు విలువైన సైబర్ మోసాలు జరగడం ఆందోళన కలిగించే విషయం. 2025లో తొలి ఆరు నెలల్లోనే మరో రూ. 70.64 కోట్లు మోసపోయారు. దీన్ని బట్టి దేశంలో సైబర్ మోసాల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

కేంద్రం స్పందన – కఠిన చర్యలు, ప్రత్యేక యూనిట్లు

ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వివరించినట్లు,లోక్‌సభకు తెలిపారు. ఇందులో భాగంగా ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (I4C) ఏర్పాటు చేశామని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల కోసం ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (cybercrime.gov.in) ప్రారంభించామని వివరించారు. దీంతో పాటు, మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు పోలీస్ విభాగాల్లో ప్రత్యేక యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870