తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలకమైన మార్పును ప్రకటించింది. ఇకపై శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లే వాహనాలన్నింటికీ ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ కొత్త నిబంధన స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం ధృవీకరించారు.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల(vehicles) రద్దీని తగ్గించడం, భక్తులకు మెరుగైన భద్రతను అందించడం, మరియు పారదర్శక సేవలు కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఫాస్టాగ్(fastag) లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డుపైకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఫాస్టాగ్ లేని వాహనదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఫాస్టాగ్(Fastag) లేని భక్తులకు ఇబ్బందులు కలగకుండా, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఒక ప్రత్యేక ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫాస్టాగ్ లేని వారు సులభంగా ఫాస్టాగ్ పొంది, ఆ తర్వాత ప్రయాణం కొనసాగించవచ్చు.

టీటీడీ చైర్మన్ భక్తులందరినీ(devotees) ఈ మార్పును గమనించి, సహకరించాలని కోరారు. తిరుమలకు ప్రయాణానికి ముందుగానే తమ వాహనాలకు ఫాస్టాగ్ ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.
Read more: hindivaartha.com
Read also: