Forest Attack : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Joint Adilabad District) కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో గల జన్నారం అటవీ డివిజన్లో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో 35 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవా రం సాయంత్రం పోడు భూమి విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం కారణంగా గిరిజనులు అటవీ శాఖ అధికారులపై దాడులకు పాల్పడ డం తెలిసిందే. కవ్వాల్ సెక్షన్లోని పాలగోరి అటవీ ప్రాంతంలో సిర్పూర్ (యు)కు చెందిన కొందరు గిరిజనులు గుడిశెలు వేసుకోవడం, వాటిని అట వీ శాఖ అధికారులు తొలగించడంతో నెలకొన్న వివాదం ఈ దాడికి దారి తీసింది. ఒక పథకం ప్రకారం కొందరు గిరిజనులు అటవీ శాఖ అధికారుల కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారని ఇంధన్పల్లి రేంజి అధికారి శ్రీధరా చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దాడిలో ఇద్దరు అటవీ అధికారులు గాయపడ్డారని ఆయన తెలిపారు. కాగా ఈ ఫిర్యాదు మేరకు 35 మందిపై కేసులు నమోదు (Cases registered) చేయగా ఈ ఘటనలో గిరిజనలను మోతీరాం అనే వ్యక్తి దాడికి ఉసిగొల్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నిందితులపై అటవీ, వన్యప్రాణి చట్టాల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :