हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Hydra: జీతాలు తగ్గించడంతో హైడ్రా సేవలను నిలిపివేసిన మార్షల్స్

Anusha
Hydra: జీతాలు తగ్గించడంతో హైడ్రా సేవలను నిలిపివేసిన మార్షల్స్

హైదరాబాద్ నగరంలో అత్యవసర సేవలకు కీలకమైన హైడ్రా మార్షల్స్‌ ఇవాళ నుండి విధులను బహిష్కరించడంతో నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. జీతాల తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దీనికి కారణమైంది.తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, హైడ్రా ఉద్యోగుల (HYDRA employees) జీతాలను రూ. 7,000 వరకు తగ్గించారు. ఈ నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన హైడ్రా మార్షల్స్, నిరసనగా విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ బహిష్కరణ ప్రభావం వెంటనే కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సాయానికి వెళ్లే 51 హైడ్రా వాహనాలు ఆగిపోయాయి. హైడ్రా కంట్రోల్ రూమ్ వద్ద వాహనాలు నిలిపివేయడంతో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఆపద సమయంలో సహాయం అందకపోవచ్చనే

హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలు అందుబాటులో లేకపోవడంతో పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో హైడ్రా వాహనాలు (Hydra vehicles) తక్షణమే స్పందిస్తాయి. కానీ సేవలు ఆగిపోవడంతో ఆపద సమయంలో సహాయం అందకపోవచ్చనే భయం ప్రజల్లో పెరిగింది.హైడ్రా మార్షల్స్ చెప్పిన ప్రకారం, గత కొన్నేళ్లుగా వారి జీతాలు పెరగకపోగా, ఇప్పుడు తగ్గించడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. వారు చెప్పినట్లు, “మేము 24 గంటలు ప్రమాదాల మధ్య పనిచేస్తున్నాం. మా కుటుంబాలు ఈ జీతంపై ఆధారపడి ఉన్నాయి. దాన్ని తగ్గించడం మాకు భరించలేనిది” అన్నారు.

ప్రస్తుతం పరిస్థితి క్లిష్టంగా మారింది

ఇకపోతే, హైడ్రా అధికారులు మార్షల్స్‌కు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, ఆయన వచ్చాక చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే అప్పటివరకు నిరసన ఆపకపోతే, రాజీనామా పత్రాలపై సంతకం చేయాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలు మార్షల్స్ ఆగ్రహాన్ని మరింత పెంచాయి.ప్రస్తుతం పరిస్థితి క్లిష్టంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి, మరోవైపు అత్యవసర సేవలు నిలిచిపోవడం వల్ల పౌర భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా మార్షల్స్ తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి, జీతం తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటేనే సేవలు పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/urea-farmers-queue-for-hours-for-urea-in-rajanna-siricilla/telangana/528742/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870