శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని గేట్లను అధికారులు మరోసారి తెరిచారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 65,827 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 60,644 క్యూసెక్కులుగా ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండి నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా, నాగార్జున సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
నాగార్జున సాగర్ గేట్ల ఓపెన్
శ్రీశైలం నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జున సాగర్(Nagarjuna Sagar ) అధికారులు ముందు జాగ్రత్తగా ప్రాజెక్టులోని 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తివేశారు. దీని ద్వారా 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ చర్య వల్ల ప్రాజెక్టులో నీటి మట్టాన్ని నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి
వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ప్రాజెక్టులోని రెండు విద్యుత్ కేంద్రాల్లో పవర్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ సరఫరాకు ఎంతగానో దోహదపడుతుంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Also : Modi : నేడు బెంగళూరులో పర్యటించనున్న మోదీ