శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన జనసేన పార్టీకి చెందిన మాజీ నాయకురాలు కోట వినుతకు (Vinutha Kota) చెన్నై సెషన్స్ కోర్టు ఆగస్ట్ 6వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.కోర్టు అనుమతించే వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆగస్ట్ 7, 8వ తేదీలలో కోట వినుత పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేశారు.ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయంగా ఈ కేసు ప్రభావం చూపింది.జూలై 7వ తేదీన శ్రీకాళహస్తిలో డ్రైవర్ రాయుడు (driver Rayudu) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టి పలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

హత్య కేసు నేపథ్యం
ఈ కేసులో కోట వినుత భర్త చంద్రబాబును ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొనగా, కోట వినుతను మూడవ నిందితురాలిగా (A3) పేర్కొన్నారు. ఇతర నిందితుల్లో A2 షేక్ తాసర్, A4 శివకుమార్, A5 గోపి ఉన్నారు. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.కోట వినుత రాజకీయ నేపథ్యం కారణంగా ఈ హత్య కేసు మరింత దృష్టిని ఆకర్షించింది. జనసేన పార్టీకి సంబంధించి ఆమెకి గతంలో కీలక బాధ్యతలు ఉండడం, ఆమె భర్త రాజకీయంగా చురుకుగా ఉండడం వల్ల మీడియా కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకనైనా కేసు విచారణ న్యాయపరంగా సాగాలంటూ పలువురు న్యాయవాదులు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీకాళహస్తి లో ఏమి ప్రసిద్ధి చెందింది?
శ్రీకాళహస్తి ముఖ్యంగా శివుని ఆలయం – శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది.
శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేకంగా చేసే పూజలు ఏవి?
ఇక్కడ ముఖ్యంగా కాల సర్ప దోష నివారణ పూజ, రాహు-కేతు శాంతి పూజలు ప్రసిద్ధి.
Read hindi news: hindi.vaartha.com
Read also: