సృష్టి ఫేక్ సరోగసీ కేసు(Srushti Case)లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా డా. నమ్రత(DR Namratha)కు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏజెంట్ల సహాయంతో ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ కార్యకలాపాలు
డా. నమ్రత ముఠా చైల్డ్ ట్రాఫికింగ్ కార్యకలాపాలు దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అస్సాం, బీహార్, ముంబై, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి అక్రమంగా పిల్లలను తీసుకొచ్చినట్లు తేల్చారు. ఈ ట్రాఫికింగ్లో ఎంతమంది ఏజెంట్లు, డాక్టర్లు, ఇతర వ్యక్తులు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతుగా వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ ముఠాల గురించి బయటపడే అవకాశం ఉంది.
80 ఫేక్ సరోగసీ కేసులను అంగీకరించిన నమ్రత
పోలీసుల విచారణలో డా. నమ్రత దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులను నిర్వహించినట్లు అంగీకరించారని సమాచారం. ఈ కేసులు కేవలం చైల్డ్ ట్రాఫికింగ్కు మాటుగా ఉపయోగపడ్డాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎంతకాలం నుంచి నడుస్తోంది, ఎంతమంది ఇందులో బాధితులుగా ఉన్నారనే వివరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసు విచారణ పూర్తయితే ఈ మోసాల వెనుక ఉన్న పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది.
Read Also : India : ఇండియాకు ఆ హక్కు ఉంది- రష్యా