Crime: లేడీ కానిస్టేబుల్ పై ఓ పోలీసే లైంగిక వేధింపులకు గురిచేస్తే ఆమె ఎవరికి చెప్పుకోవాలి? అంతటితో ఆగక ఆ మోసగాడు మూడుసార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. రక్షించాల్సిన పోలీసులే కంచె చేనుమేస్తే ఏం చేయాలి? ఆ బాధితురాలు మాత్రం ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం
బాధిత మహిళ బక్సార్ జిల్లా (Buxar District) లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నది. నిందితుడు గయా జిల్లాకు చెందిన కానిస్టేబుల్. ఇద్దరికి ఫిబ్రవరి 2023లో జరిగిన క్యాంపస్ లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె నంబర్ తీసుకుని ఫోన్లో తరచుగా మాట్లాడేవాడు. 2023 ఏప్రిల్లో బాధితురాలు వవారణాసికి వెళ్లినప్పుడు, నిందితుడు కూడా వచ్చాడు. అక్కడే ఓ హోటల్లో బాధితురాలితో బలవంతంగా శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఎదురుతిరగడంతో ఆమెను బతిమిలాడు. తన ఉద్యోగం పోతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను క్షమాపణలు కోరాడు.
రహస్యంగా పెళ్లి
2023 మేలో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు, ఎవరికీ తెలియకుండా ఆమెను జార్ఖండ్ (Jharkhand)లోని దేవగఢ్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరుగా ఉండేవారు. ఆ తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులను కలవాలని మహిళ కానిస్టేబుల్ అడిగినా, పలు కారణాలు చెప్పి వాయిదా వేసేవాడు. త్వరలోనే తన కుటుంబానికి పరిచయం చేస్తానని చెప్పి మందులు ఇచ్చి గర్భాన్ని తొలగించాడు. అలా రెండేళ్లల్లో మూడుసార్లు గర్భం దాల్చింది. ప్రతిసారి ఏదొక కారణం చెప్పి దానిని తొలగించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే 2025మేలో నిందితుడు మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలియడంతో బాధితురాలు మోసపోయినట్లు తెలుసుకుని
పోలీసులను ఆశ్రయించింది.
నిందితుడిని సస్పెండ్చేసిన అధికారులు
కాగా బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు డుమ్రాన్ పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిన వేధింపులకు గురిచేసినట్లు కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: