Samsung Galaxy Book 4 Edge: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ భారత్లో తన అత్యాధునిక ఏఐ ల్యాప్టాప్ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ (Samsung Galaxy Book 4 Edge) పేరుతో విడుదలైన ఈ ల్యాప్టాప్, అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ప్రాసెసింగ్ పవర్ను పెంచేలా ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ (Qualcomm Snapdragon X) ప్రాసెసర్ను ఉపయోగించారు.

ధర & కొనుగోలు లభ్యత
ఈ ల్యాప్టాప్ ధరను రూ. 64,990గా నిర్ణయించారు. అయితే బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లతో దీని ధర మరింత తగ్గే అవకాశముంది. శాంసంగ్ ఇండియా స్టోర్, ఫ్లిప్కార్ట్, శాంసంగ్ షాప్ యాప్, ఎక్స్పీరియెన్స్ స్టోర్లు, మరియు ఇతర రిటైల్ అవుట్లెట్లలో ఈ ల్యాప్టాప్ అందుబాటులో ఉంది.
గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ స్పెసిఫికేషన్లు
ఈ ల్యాప్టాప్లో 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు, 16GB RAM మరియు 512GB స్టోరేజ్ లభిస్తుంది. ధ్వని పరంగా డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు (Dual stereo speakers) ఉంటాయి. అదనంగా HDMI పోర్ట్, USB 3.2, మైక్రో SD రీడర్, హెడ్ఫోన్ జాక్, ఫింగర్ప్రింట్ స్కానర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లూ ఉన్నాయి.
పవర్పుల్ బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ల్యాప్ టాప్లో వైఫై 7 కనెక్టివిటీని అందిస్తున్నారు. 1080పి హెచ్డీ కెమెరా కూడా ఉంది. ఇందులో 61.2 వాట్ అవర్ బ్యాటరీ ఉండగా, దీనికి 65 వాట్ల యూఎస్బీ టైప్ సి చార్జింగ్ను అందిస్తున్నారు. అందువల్ల ల్యాప్ టాప్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది.
వర్క్ఫ్లోకి AI టూల్స్
ఈ ల్యాప్టాప్లో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ ద్వారా ఏఐ టూల్స్ అందించబడుతున్నాయి. ముఖ్యమైన రీకాల్ (Recall) ఫీచర్ పూర్వపు డేటాను గుర్తు చేస్తుంది. లైవ్ ట్రాన్స్లేట్ వాస్తవ కాలంలో అనువాదం చేస్తుంది. కోక్రియేటర్ (Co-Creator) సాయంతో సృజనాత్మక పనులను వేగంగా చేయొచ్చు.
ఇవే కాకుండా శాంసంగ్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన గెలాక్సీ ఏఐ టూల్ ఇందులో ముందుగానే ఇంటిగ్రేట్ చేయబడింది. ముఖ్యంగా చాట్ అసిస్ట్ అనే ఫీచర్, వినియోగదారులకు మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: