హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్(TG Engineering) కాలేజీని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు కానున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజీ నీరింగ్లో 4 కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 32ను విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజనీరింగ్(TG Engineering) కాలేజీల్లో బిటెక్-సిఎస్ఈ, బిటెక్-సిఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), బిటెక్- కంప్యూటర్ సైన్స్ అండ్(CSE) ఐటీ, బిటెక్-డాటా సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్స రం నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నట్టు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున 240 సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఎప్ సెట్- 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో మూడో ఫేజ్లో తెలంగాణ(Telangana) యూని వర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
Read Also: