हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Venkaiah Naidu: శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు.. వీఐపీల దర్శనాలపై సలహా

Anusha
Venkaiah Naidu: శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు.. వీఐపీల దర్శనాలపై సలహా

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు భక్తుల హృదయాలను తాకుతున్నాయి. సోమవారం ఉదయం వెంకయ్య నాయుడు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshanam) లో స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు, శ్రీవారి దర్శనంలో వీఐపీల దర్శనంపై స్పందించారు. వీఐపీలు తిరుమలకు ఏడాదికి ఒకసారి మాత్రమే రావాలని సూచించారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ఈ నియమాన్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ సూచన చేశారు. టీటీడీ నిధుల్ని శ్రీవారి భక్తుల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని, ఈ నిధుల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు.

Venkaiah Naidu:  శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు.. వీఐపీల దర్శనాలపై   సలహా
Venkaiah Naidu: శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు.. వీఐపీల దర్శనాలపై సలహా

కుటుంబ సభ్యులతో

ఊరికో గుడి, బడి ఉండాలని,బడి బాధ్యత ప్రభుత్వానికి ఉంటే, గుడి బాధ్యత టీటీడీ తీసుకోవాలని వ్యాఖ్యానించారు.అంతకముందు వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్‌‌లు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

వెంకయ్య నాయుడు ఎక్కడ జన్మించారు?

వెంకయ్య నాయుడు 1949 జూలై 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా చవూరుపల్లిలో జన్మించారు.

ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది?

వెంకయ్య నాయుడు విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తరువాత భాజపాలో కీలక నేతగా ఎదిగారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Durga Temple Service : దుర్గమ్మవారి సేవలో ఎపి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870