చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
హైదరాబాద్ : బిజెపి, బిఆర్ఎస్ రెండు వేరువేరు కాదని మొదటి నుంచి చెబుతున్నామని, పదేళ్లుగా వాళ్ల మధ్య ఫెవికల్ బంధం ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) అన్నారు. ఆదివారం సిఎల్ఎపి కార్యాలయంలో మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ మద్దతు ఇచ్చినప్పుడే ఆ పార్టీల బంధం బయటపడింది. బిజెపిను బిజెపికి హోల్ సేల్ గా అమ్మడానికి కెటిఆర్ ఒప్పందం చేసుకున్నాడు. ఇడి సిబిఐ కేసులు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రాకుండా ఉంటే బిఆర్ఎస్ను బిజెపిలో విలీనం చేస్తామని అన్నారని సీఎం రమేష్ చెప్పారు.
పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదా
సిఎం రమేష్ ను కెటిఆర్ కలిసింది. నిజామా కదా చర్చలు జరిగింది వాస్తవం కదా అని నిలదీశారు. బిఆర్ఎస్ విలీనం కోసం చర్చలు వాస్తవమే అని బండి సంజయ్ అన్నారని సమాధానం చెప్పాలని అన్నారు. సిఎం రమేష్ (CM Ramesh) ను తీసుకువస్తా చర్చకు రండీ అని కెటిఆర్ను మంత్రి బండి సంజయ్ పిలిచారు. ఇంకా తేలుకుట్టిన దొంగల ఎందుకు ఉన్నావ్ కెటిఆర్ ఎప్పుడూ వెళ్తున్నవో చెప్పు అని కోరారు. పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదా ఇంకెన్నేళ్ళు మోసం చేస్తారు అని కెటిఆర్ ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల లో అవకతవకలు జరిగితే ఇడి, సిబిఐ వచ్చేవి కదా అని మేడిపల్లి సత్యం సందేహం వ్యక్తంచేశారు. అనేక కాంట్రాక్టులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది మీరు.

బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేయాలని
8ఎంపీలు బిజెపి గెలవడానికి కారణం బిఆర్ఎస్ మాత్రమే అన్నారు. బిఆర్ఎస్ గంపగుత్తగా బీజేపీ కి ఓట్లు అమ్ముకున్నారు. బిఆర్ఎస్, బిజెపి ఒప్పందంలో భాగంగానే బిజెపి కి డమ్మీ అధ్యక్షుడిని నియమించారుపదేళ్లు దోచుకొని బిఆర్ఎస్ ను బిజెపికి అమ్మడానికి ప్రయ త్నాలు చేశారు. కవిత కూడా బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేయాలని ప్రయత్నం చేశారు అని చెప్పింది. పదేళ్లలో విద్యార్థులు, యూనివ్సిటీ లు, కాలేజీలు గుర్తుకురాలేదు. బిఆర్ఎస్ కి ఓటు వేస్తే మురిగిపోయినట్లే బిఆర్ఎస్ కి ఓటు వేస్తే బిజెపి కి వేసినట్లే.. ప్రజలు ఆలోచించాలి అన్నారు.
మెడిపల్లి నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు?
మెడిపల్లి నియోజకవర్గం అనేది ప్రత్యేకమైన అసెంబ్లీ నియోజకవర్గంగా లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని ఒక మండలంగా ఉంది. మెడిపల్లి ప్రాంతం ప్రస్తుతం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
మేడిపల్లి ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి పనులు జరుగుతున్నాయి?
మెడిపల్లి లో మున్సిపల్ విభాగం పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సెంటర్లు నిర్మాణం ముఖ్యమైనవి.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Nagole: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి