ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నది. ఏడాదికి పైగా వీరిమధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా చేసిన ప్రతిపాదనను హమాస్ (Hamas) అంగీకరించలేదు. తమకు దీనిపై ఆసక్తి లేదని హమాస్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ (Israel) గాజాలలో తమ సైనిక చర్యలను మరింత ఉద్రిక్తం చేసి పనిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.

వాళ్లు చావాలని కోరుకుంటున్నారు: ట్రంప్
‘హమాస్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆసక్తి చూపడం లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ (Israel) తమ పనిని పూర్తి చేయాలని’ ట్రంప్ (Trump) వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా గాజాలో పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. తిండిలేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా గాజాపై దాడులు చేసే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అలాగే గాజాలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకొచ్చేందుకు, హమాస్ పాలనను అంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నట్లు నెతన్యాహు తెలిపారు.
గాజాకు అంతర్జాతీయ స్వచ్చంద సంస్థల సాయం
గాజాలో ప్రజలు ఆహారం, వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆకలితో పిల్లలు మరణిస్తున్నారు. దీనితో అంతర్జాతీయ స్వచ్చంద సంస్థలు మానవతా సాయం చేస్తున్నాయి. గాజాలో ఉండే మానవతా కేంద్రాలకు ఆహారం కోసం వచ్చే ప్రజలపై కూడా ఇజ్రాయెల్ ఇటీల కాల్పులు జరపడం కలకలం రేపింది. గత 21నెలలుగా గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో 59వేలమందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇటీవల అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Bangladesh: బంగ్లాదేశ్, పాకిస్థాన్ల మధ్య కొత్త స్నేహం