हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

M.K Stalin: కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డ సీఎం స్టాలిన్

Sharanya
M.K Stalin: కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డ సీఎం స్టాలిన్

బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ప్రభుత్వం (Central Govt) దుర్వినియోగం చేస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ (M.K Stalin) ఆరోపించారు. వెనుకబడిన వర్గాల ఓటర్లను నిశ్శబ్దంగా తొలగించేందుకు, తద్వారా బీజేపీకి అనుకూలంగా సమతుల్యతను పంచడానికి ఈ సవరణను దుర్వినియోగం చేస్తున్నారని స్టాలిన్ శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ‘ఇది సంస్కరణ గురించి కాదు. ఇది ఇంజనీరింగ్ ఫలితాల గురించి’ అని స్టాలిన్ తన ‘ఎక్స్’ హ్యాండిల్ పోస్టులో పేర్కొన్నారు.

బీహార్లో ‘ఢిల్లీ పాలన’

వెనుకబడిన ఓటర్లను తొలగించేందుకు కేంద్రం భారీ కుట్ర చేస్తున్నదని, ప్రజాస్వామ్యానికే ముప్పువాటిల్లే నిర్ణయాలు బీజేపీ తీసుకుంటున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే భారీగా నష్టపోతారని స్టాలిన్ (M.K Stalin) హెచ్చరించారు. తమిళనాడు (Tamil Nadu) లో తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటానని, తన శక్తిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యమే మన ఆయుధమని, దాన్ని ఉపయోగించి, మోడీప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.

అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి

ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణతో ముందుకు సాగే ముందు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికార అర్చన పట్నాయక్ను కోరింది. జనవరి 1న రాష్ట్రం సాధారణ సారాంశ సవరణకు బదులుగా ప్రత్యేక సవరణ డ్రైవ్ను చేపడుతుందని సూచించే నివేదికలపై సీపీఎం రాష్ట్రం కార్యదర్శి పి.షణ్ముగం సిఈవోకి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ లో నిర్వహిస్తున్నట్లుగా ఇలాంటి తొందరపాటు చర్య లక్షలాదిమంది అర్హులైన ఓటర్ల జాబితా నుండి తొలగించేందుకు దారితీస్తుందని పార్టీ హెచ్చరించింది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Kargil Vijay Diwas: కార్గిల్ దివాస్..అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870