మహబూబ్ నగర్: లూడో గేమ్ ఊబిలో చిక్కుకొని ఓ యువకుడు మృతి చెందగా అతడి మృతిని తట్టుకోలేక మనోవేదనతో అతడి తాత మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వెంకటేష్ (23) అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్లి రోస్ట్ కేఫ్గా తోటమాలిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడు ఆన్లైన్ గేమ్స్ (Online games) ఆడడం మొదలుపెట్టాడు.
మనువడు మరణాన్ని జీర్ణించుకోలేక తాత మృతి
ఆన్లైన్లోని ఓ యాప్లో లూడో గేమ్ ఆడి రూ.5 లక్షలు నష్టపోవడంతో ఎవరికీ చెప్పుకోవాలి, ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాడు. ఈక్రమంలో తల్లిదండ్రులకు చెప్పాలో తెలియక శనివారం తీవ్ర మనోవేదన చెంది విషం తాగి ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈమేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని వారి తల్లి తండ్రులకు అప్పగించారు. అతని స్వగ్రామం రాయికోడ్ లో సోమవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. వెంకటేష్ చనిపోయి ఐదు రోజులు కావడంతో కార్యక్రమాలు నిర్వహించి కుటుంబ సభ్యులు, బంధువుల తో పాటు యువకుని తల్లిదండ్రులు తాత పోతుల బాలప్ప (78) ఆచారం ప్రకారం మక్తల్ సంతకు వెళ్లి బుధవారం ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే మనువడు మరణాన్ని జీర్ణించుకోని బాలప్ప మనో వేదనతో బుధవారం సాయంత్రం ఇంట్లోనే కుప్పకూలిపో యాడు. వైద్యులను పిలిపించి పరీక్షించగా అతను అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. ఐదు రోజుల తేడాతో మనవడు. తాతా మృతి చెందడంతో వారి కుటుంబంలో రోదనలు మిన్నంటాయి .
Read hindi news: hindi.vaartha.com
Read also: School Holiday : స్కూళ్లకు సెలవు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు