ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన సినిమా ప్రాజెక్ట్పై స్పందించారు. మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ ‘హరి హర వీరమల్లు పార్ట్ – 2’ (‘Hari Hara Veeramallu Part – 2’) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.’హరి హర వీరమల్లు పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా పవన్ మీడియాతో ముఖాముఖి మాట్లాడారు. అభిమానుల్లో అంచనాలు పెరిగిన నేపథ్యంలో పవన్ మాట్లాడిన విషయాలు హైలైట్గా మారాయి.రెండవ భాగాన్ని తాను పూర్తిగా మనసుతో చేయాలనుకుంటున్నానని పవన్ చెప్పారు. అయితే ఆ మూవీ చేయాలంటే తగిన బడ్జెట్, సరైన సమయం అవసరం అని వివరించారు. “ఈ రెండూ ఉంటేనే పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాను. దేవుడి దయ ఉండాలి” అని పవన్ అన్నారు.

ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయింది
‘హరి హర వీరమల్లు పార్ట్ 2’లో షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని పవన్ చెప్పుకొచ్చారు. దాదాపు 20–30 శాతం వరకూ చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు. ఇది అభిమానులకు ఊరట కలిగించే అంశంగా మారింది.సినిమా కథ విషయానికొస్తే, కోహినూర్ వజ్రాన్ని బలవంతంగా తీసుకెళ్లిన చరిత్ర నేపథ్యంగా ఈ కథ ఉందని పవన్ వివరించారు. “ఇది ఒక ఊహా కథే. కానీ ప్రజల్లో దేశభక్తిని నింపేలా రూపొందించాం” అని ఆయన వివరించారు.
సర్వాయి పాపన్నతో సంబంధం లేదు
ఈ చిత్రం సర్వాయి పాపన్న జీవితకథ ఆధారంగా నిర్మించలేదని పవన్ స్పష్టం చేశారు. చాలామంది ఫిక్షనల్ కథను పాపన్నతో కలిపి చూస్తున్నారని, కానీ ఈ సినిమా పూర్తిగా వేరే అని ఆయన పేర్కొన్నారు.రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ సినిమాలపై స్పష్టత ఇవ్వడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. పార్ట్ 1 విడుదల తర్వాత పార్ట్ 2 గురించి మరిన్ని అప్డేట్స్ రావొచ్చని ఆశిస్తున్నారు.
Read Also : HHVM : వీరమల్లు సినిమా హిట్ అవ్వాలని జనసైనికుల పూజలు