చైనాకు భారత్ భారీ షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ దిశలో
గట్టి అడుగుపడింది. భారత ప్రభుత్వం బ్లాక్ మాస్ (Black mass) ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశీయరంగంలో బ్యాటరీ ముడి పదార్థాల సరఫరా శ్రేణిని ఆత్మనిర్బర్ (Atmanirbar) దిశగా నడిపించే విప్లవాత్మక చర్యగా చెప్పవచ్చు.

బ్లాక్ మాస్ అంటే ఏమిటి?
బ్లాక్ మాస్ (Black mass) అనేది లిథియమ్-అయాన్ బ్యాటరీలను ష్రెడ్ చేసిన తరువాత లభించే ఓ పొడి పదార్థంగా చెప్పుకోవచ్చు. ఇందులో లిథియమ్, కోబాల్ట్, నికెల్, గ్రాఫెట్ వంటి కీలకమైన ఖనిజాలు ఉంటాయి. బ్లాక్ మాస్కు భారీగా డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా ఈవీలు, ఎనర్జీస్టోరేజ్ సిస్టమ్స్, కన్యూమర్ ఎలక్ట్రానిక్స్ పెరుగుతున్న నేపథ్యంలో దీని ధరలు తెలియకుండానే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పొడిని మనం చైనా (China) కు అత్యంత తక్కువ ధరకే స్క్రాప్కింద చైనాకు ఎగుమతి చేస్తున్నాం. ఇది మనదేశంలోనే చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. చైనా దీన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీలను తయారు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నది. తద్వారా చైనాకు భారీగా లాభాలు పొందుతున్నది.
దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి?
బ్యాటరీ ముడిపదార్థాల దిగుమతులపై మనదేశం ఆధారపటాన్ని భారీగా తగ్గించవచ్చు.
లోకల్ తయారీదారులకు ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆత్మనిర్బర్ భారత్లో సర్క్యులర్
ఎకానమీ లక్ష్యాలను వేగంగా కేంద్రం సాధించవచ్చు. ఆధారపటాన్ని భారీగా తగ్గించవచ్చు.
లోకల్ తయారీదారులకు ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆత్మనిర్బర్ భారత్లో సర్క్యులర్
ఎకానమీ లక్ష్యాలను వేగంగా కేంద్రం సాధించవచ్చు.
బ్లాక్ మాస్ అంటే ఏమిటి?
బ్లాక్ మాస్ అనేది లిథియం-ఆయన్ బ్యాటరీలను రీసైకిల్ చేసిన తర్వాత వచ్చే మిశ్రమ పదార్థం. ఇందులో లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన లోహాలు ఉంటాయి, ఇవి కొత్త బ్యాటరీల తయారీకి కీలకం.
Read hindi news: hindi.vaartha.com
Read also: Earthquake: అలాస్కా, తజికిస్తాన్లో భూకంపం