ఆన్లైన్ బెట్టింగ్లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ
వ్యసనం బారినపడి, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరెంతోమంది అప్పుల ఊబిలో
కొట్టుమిట్టాడుకున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. ఆన్లైన్ బెట్టింగ్ (Online betting)
ప్లపైకేంద్రం కఠిన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి)
ముమ్మరం చేసింది. టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు చేపట్టింది.
అయినప్పటికీ,గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా
ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల
(Betting apps) ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్సైట్ల లింక్లను కూడా అందుబాటులో
ఉంచుతున్నాయని ఈడీ ఆరోపిస్తున్నది.

మహదేవ్ బెట్టింగ్ యాప్పై కేసు
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగు చూసాయి. అంతేకాదు ఈ
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీనటులు,
యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ (ED) కేసు నమెదు చేసింది. బెట్టింగ్ యాప్లకు ఎంత
దూరంగా ఉంటే అంత మంచిది. ప్రత్యేకంగా యువత ఈ ఊబిలో పడకుండా జాగ్రత్తపడాలి.
అత్యాశకుపోతే ప్రాణాలే బలైపోతాయి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ
ఉంచాలి. కళాశాల విద్యార్థులు స్నేహితుల ఒత్తిడితో ఇలాంటి తప్పుడు మార్గాల్లో
పయనిస్తుంటారు. తస్మాద్ జాగ్రత్త.
ED కు ఉన్న అధికారాలు ఏమిటి?
ED (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) భారత ప్రభుత్వానికి చెందిన ఒక ముఖ్యమైన అన్వేషణ సంస్థ. దీని బాధ్యతలు ఆర్థిక నేరాలను దర్యాప్తు చేయడం, ఆర్థిక చట్టాలను అమలు చేయడం.
ED (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు పోలీస్ అధికారులు కాదా?
కాదు, ED అధికారులు పోలీస్ అధికారులు కారు. వారు ప్రత్యేకంగా ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం నియమించబడిన కేంద్ర ప్రభుత్వ అధికారులే గానీ, పోలీస్ శాఖకు చెందని వారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Ruturaj Gaikwad: యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నుంచి వైదొలిగిన రుతురాజ్ గైక్వాడ్