భారతీయ సంస్కృతిలో శ్రావణమాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసాన్ని హిందువులు పవిత్రమాసంగా భావిస్తారు. ప్రత్యేక పూజలు, పునస్కారాలతో తమ భక్తిపారవశ్యాన్ని చాటుకుంటారు. ప్రస్తుతం ఉత్తారాది అంతటా శ్రావణమాస (Shravan month) శోభ నెలకొంది. హిందువులు ఆలయాలను దర్శిస్తుంటారు. ఈ మాసమంతా మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాంసాహారం విక్రయించడం తగదంటూ, యూపీలోని ఘజియాబాద్లో హిందూ రక్షాదల్ సభ్యులు ప్రముఖ కెఏఎఫ్సీ (KFC) అవుట్లెట్ ముందు ఆందోళనకు దిగారు.
వెంటనే విక్రయాలు నిలిపివేయాలి
శ్రావణమాసం అంతటా మాంసం విక్రయాలను (Meat sales) నిలిపివేయకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని రక్షాదళ్ సభ్యులు హెచ్చరించారు. ఘజియాబాద్ మీదుగా కన్వర్ యాత్ర సాగుతున్న తరుణంలో తలెత్తిన ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులను సంఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారులను శాంతింపజేశారు. ఈ ఘటన అనంతరం సదరు సెంటర్ ఈ శ్రావణమాసం అంతటా శాఖాహారం మాత్రమే అందస్తామంటే ఒక నోటీసును అతికించారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Mohammad Azharuddin: మహ్మద్ అజారుద్దీన్ ఇంట్లో భారీ చోరీ..