हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Jack Russell : క్రికెట్ దిగ్గజం నుంచి చిత్రకారుడిగా : జాక్ రస్సెల్

Divya Vani M
Jack Russell : క్రికెట్ దిగ్గజం నుంచి చిత్రకారుడిగా : జాక్ రస్సెల్

ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జాక్ రస్సెల్ (Jack Russell) , ఇప్పుడు తన జీవితాన్ని రంగులతో నింపుతున్నాడు. క్రికెట్ (Cricket) మైదానంలో ఎంత శ్రద్ధగా ఆడాడో, ఇప్పుడు అదే ఉత్సాహంతో చిత్రకళను అంటిపెట్టుకున్నాడు. క్రికెట్‌లో సచిన్, కుంబ్లే, అజహర్‌లతో కలిసి ఆడిన రస్సెల్, ఇప్పుడు బ్రష్‌తో తన ముద్ర వేస్తున్నాడు.ఇతరులా ఫోన్, వాట్సాప్ వాడటం రస్సెల్‌కు ఇష్టం లేదు. తనతో మాట్లాడాలంటే కేవలం ఈమెయిల్‌మే మార్గం. ఇదొక రేర్‌ లక్షణం సోషల్ మీడియాలో మాత్రం తన బొమ్మలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. లండన్‌లోని క్రిస్ బీటిల్స్ గ్యాలరీలో అతడి చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

Jack Russell : క్రికెట్ దిగ్గజం నుంచి చిత్రకారుడిగా : జాక్ రస్సెల్
Jack Russell : క్రికెట్ దిగ్గజం నుంచి చిత్రకారుడిగా : జాక్ రస్సెల్

ఆటకు వీడ్కోలు.. కళతో కొనసాగింపు

1988 నుంచి 1998 వరకు రస్సెల్‌ ఇంగ్లండ్ తరఫున 54 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ప్రత్యేకమైన బ్యాటింగ్ స్టాన్స్, సన్‌గ్లాసెస్, వేగవంతమైన వికెట్ కీపింగ్‌తో అందరి మన్ననలు పొందాడు. ఇప్పుడు కళలో అదే విలక్షణతను చూపిస్తున్నాడు.

భారత వీధుల్లో బొమ్మలు గీసిన అనుభవం

“ఒకసారి భారత వీధుల్లో ఇంగ్లండ్ జెర్సీతో బొమ్మలు గీస్తున్నా. కానీ అక్కడి పోలీసులు వెళ్లిపోమన్నారు. అది నిజానికి సరైన నిర్ణయమే. ఎందుకంటే అర్థం కాని పరిస్థితి వచ్చింది,” అని తన అనుభవాన్ని షేర్ చేశాడు రస్సెల్. అతను భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాల్లో తన కళా పయనాన్ని కొనసాగించాడు.

స్నేహితులు గుర్తొస్తే.. బ్రష్ చేతిలోకి వస్తుంది

రస్సెల్‌కి సచిన్, శ్రీనాథ్‌ వంటి క్రికెటర్లతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలే అతడి బొమ్మల్లో ప్రత్యక్షమవుతున్నాయి. జవగల్ శ్రీనాథ్‌తో గ్లౌస్టర్‌షైర్ జట్టులో గడిపిన రోజులు అతనికి మధురం.

రంజిత్‌సింగ్‌జీ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు

ఇటీవల, రస్సెల్‌ ఇంగ్లండ్ తరపున ఆడిన మొదటి భారతీయ క్రికెటర్ రంజిత్‌సింగ్‌జీ చిత్రాన్ని గీశాడు. “ప్రతి సంవత్సరం చరిత్రలోని ఓ వ్యక్తిని గీయాలనుకుంటా. ఈసారి రంజిత్‌సింగ్‌జీని ఎంచుకున్నా. అతని చరిత్ర నాకు బాగా నచ్చింది,” అని తెలిపాడు. లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సందర్భంగా అతడి చిత్రం ప్రదర్శన ఆకర్షణగా మారింది.

క్రికెట్ నుంచి కళ వరకు… ప్రేరణగా మారిన జీవితం

జాక్ రస్సెల్ ప్రయాణం స్పష్టంగా చెబుతుంది – అభిరుచి ఉంటే వృత్తిగా మలచుకోవచ్చు. క్రికెట్ మైదానంలో సంపాదించిన అనుభవం, ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీల గోడలపై కనిపిస్తోంది. అతడి జీవితం ప్రతి అభిమానికి ఒక స్ఫూర్తిదాయక కథ.

Read Also : AAIB : ఎయిరిండియా ప్రమాదం.. నిరాధార వార్తలపై స్పందించిన ఏఏఐబీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870