దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా (Gold smuggling) కేసులో కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కు బెంగళూరు కోర్టు ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు, ఇప్పుడు బెయిల్ పునఃదరఖాస్తు అవకాశాన్ని కూడా నిరాకరించింది. దీనితో ఆమెకు సంవత్సరం పాటు జైలు జీవితం తప్పదని స్పష్టమైంది.

విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ చట్టం కింద శిక్ష
ఈ కేసులో విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ చట్టం (FEMA) మరియు స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) కింద నటి రన్యారావు (Ranya Rao) పై కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి ఏడాది జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు మరో ఇద్దరు నిందితులు(Two more accused) కూడా అదే విధమైన శిక్షను ఎదుర్కొంటున్నారు.
దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు యత్నం
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో, దుబాయ్ నుంచి ప్రయాణించిన నటి రన్యారావు, 14.3 కిలోల బంగారం (మొత్తం విలువ ₹12.56 కోట్లు) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
స్మగ్లింగ్ రాకెట్లో మిగిలిన నిందితులు
ఈ కేసులో రన్యారావుతో పాటు తరుణ్ కొండూరు రాజు అనే వ్యక్తి, మరియు జ్యువెలర్ సాహిల్ జైన్ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. కోర్టు తాజా తీర్పు ప్రకారం, ఈ ముగ్గురూ ఏడాది పాటు జైల్లో ఉండనున్నారు. విచారణకు ప్రతి మూడు నెలలకూ ఒకసారి కోర్టు హాజరు అవసరమని స్పష్టం చేసింది.
కోర్టు తీర్పు – బెయిల్ లేని శిక్ష
కేవలం జైలు శిక్షే కాకుండా, కోర్టు రన్యారావుకు బెయిల్ దరఖాస్తు చేసే హక్కునూ రద్దు చేసింది. ఇది ఆమెకు తీవ్రమైన న్యాయపరమైన దెబ్బగా భావించవచ్చు. ప్రస్తుతం ఆమెను మరోసారి బెయిల్ కోసం అర్జీ పెట్టుకునే అవకాశమే లేకుండా చేసింది .
నటి రన్యారావును ఏ కేసులో కోర్టు శిక్షించింది?
నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.3 కిలోల బంగారం అక్రమంగా భారత్కు తరలిస్తున్న సందర్భంలో పట్టుబడిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు కోర్టు ఆమెకు శిక్ష విధించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Today Gold Update: అంతుచిక్కని బంగారం ధరలు..పెరిగి మళ్లీ తగ్గుతున్నాయి