అవినీతి అధికారులపై విచారణకు నిర్ణయం
హైదరాబాద్: బిఆర్ఎస్ సర్కారు(BRS Govt) హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు (Project)లో కీలక హోదాలో పనిచేసి ఆ తరువాత అవినీతి ఆరోపణలపై ఎసిబి కేసుల్లో ఇరుక్కుని అరెస్టయిన అధికారులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)(ED) దృష్టి సారించింది. కాళేశ్వరంలో ఇఎన్సిగా పనిచేసి ఎసిబికి పట్టుబడ్డ వారు ఇద్దరయితే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వుండి దొరికిపోయిన వారు మరొకరు. వీరి వద్ద వందల కోట్ల రూపాయల ఆస్తులు వుండడం, కోట్లాది రూపాయల నగదు, బంగారు నగలు పట్టుబడడం ఎసిబి అధికారులను సైతం ఆశ్చర్య ప రిచింది. నీటి పారుదల శాఖ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఇఎన్సీలతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి, ఇతర స్థాయి అధికారులు పట్టుబడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి
ఎసిబికి పట్టుబడ్డ వారిలో భూక్యా హిరిరాం నాయక్, మురళీధర్ రావులు ఇఎన్సి హోదా కలిగిన వారు కాగా నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదా కలిగిన అధికారి. ఇందులో మురళీధర్ రావు పదవీ విరమణ చేసినా 13 ఏళ్లుగా అక్కడే కొనసాగు తున్నారు. మిగతా ఇద్దరు సర్వీసులో వుండి ఎసిబికి దొరికిపోయారు. భూక్యా హరిరాం నాయక్ భార్య సైతం నీటి పారుదల శాఖలోనే ఇఎన్సిగా వుండడం, ఆమెపైనా అవినీతి ఆరోపణలు వుండడంతో ఎసిబి దీనిపైనా వివరాలు సేకరించింది. వీరితో పాటు మరికొందరు నీటి పారుదల శాఖ అ ధికారులు కూడా ఎసిబికి దొరికిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తుండడం, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప నిచేసిన పలువురు ఉన్నతాధికారులు ఎసిబి కేసుల్లో పట్టుబడి, వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగివుండడంతో ఈ మొత్తం వ్యవహారంపై పూ ర్తిస్థాయి విచారణకు ఈడీ రంగం సిద్ధం చేసింది.
ఈడీ అధికారులు ప్రభుత్వానికి లేఖ!
కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసి ఎసిబికి పట్టుబడ్డ అవినీతి అధికారుల వివరాలను తమకు అందజే యాలని ఈడీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. దీని తరువాత ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు మరో కేసు నమోదు చే సి విచారణ చేసే వీలుంది. ఈడీకి అందిన సమాచారం మేరకు తాజాగా అరెస్టయిన ఇఎన్సీ మురళీధర్ రావు కుమారుడు అభిషేక్ రావు ఓ కంపెనీ నెలకొల్పగా అందులో నీటి పారుదల శాఖలో అక్రమార్కులు భారీగా పెట్టుబడులు పెట్టారు. దీనిపై పక్కా సమాచారం సేకరించిన ఈడీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసి అవినీతి కేసులో అరెస్టయిన వారి వివరాలను తీసుకుని, వారిపై చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నారు .
కాళేశ్వరం దేనికి ప్రసిద్ధి చెందింది?
పుష్కరాలకు ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం - ది హిందూ
కాళేశ్వరం ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన గౌరవనీయమైన తీర్థయాత్ర అయిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా ప్రసిద్ధి చెందింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమా వైఫల్యమా?
తెలంగాణ రాష్ట్ర జల సంక్షోభానికి ఒక మైలురాయిగా ఒకప్పుడు చెప్పబడిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) ఇప్పుడు వివాదంలో, నిర్మాణాత్మక ఇబ్బందుల్లో చిక్కుకుంది
Read hindi news: hindi.vaartha.com
Read Also : Kamal Meets Rajini : రజినీకాంత్ ను కలిసిన కమల్ హాసన్