हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

World Food India-2025 : వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా భాగస్వామిగా ఏపీ

Divya Vani M
World Food India-2025 : వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా భాగస్వామిగా ఏపీ

కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలో భారత్ మండపం (Bharat Mandapam in New Delhi)లో భారీ ఈవెంట్‌ నిర్వహించనుంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా-2025’ (World Food India-2025)పేరుతో జరగనున్న ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామిగా పాల్గొంటుంది.ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ, ఏపీ కూడా ఈ వేదికపై తన ప్రత్యేకతను చాటాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఆధారిత శ్రేణులను ప్రపంచానికి చూపించేందుకు ఇదొక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.

Andhra Pradesh : వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా భాగస్వామిగా ఏపీ
Andhra Pradesh : వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా భాగస్వామిగా ఏపీ

విశిష్టతల ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ముడి పదార్థాల లభ్యత, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాల వివరాలు ప్రదర్శించనుంది. రాష్ట్రానికి ఉన్న వ్యవసాయ వనరుల ప్రభావాన్ని, పరిశ్రమలకు దోహదపడే అంశాలను ఈ వేదికపై ఆవిష్కరించనుంది. దీని ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి నోడల్ బాధ్యత

ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ.1.271 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేసింది. ఈ నిధులను వినియోగిస్తూ రాష్ట్రం తరపున stall లు, ప్రొడక్ట్ డెమోస్, ప్రెజెంటేషన్లు నిర్వహించనున్నారు.

అంతర్జాతీయ వేదికపై ఏపీకు అవకాశాల వేదిక

వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 వేదికలో పాల్గొనడం ద్వారా ఏపీకి అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచం ముందుంచే ఈ వేదికలో రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Read Also : Indian Food : వడాపావ్, సమోసా, జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870