సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహానగరాన్ని శబ్దాల, రంగుల, భక్తి ఉత్సాహాలతో నింపుతూ అమ్మవారికి అర్పించిన బోనాలతో దేవీ నామస్మరణలు మార్మోగుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతాల్లో,ఉజ్జయిని మహంకాళి బోనాల పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ జాతర సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు.ఈ పవిత్ర ఘట్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ (CM Revanth Reddy) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. కొండా సురేఖ తలపై బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ తల్లిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు. సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రతిష్టాత్మకంగా
హర్యానా గవర్నర్ బంగారు దత్తాత్రేయతోపాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.లష్కర్ బోనాల సందర్భంగా ఇప్పటికే ఆలయ పరిసరాలు భక్తులతో కిటికటలాడుతున్నాయి. ఆషాడమాసంలో జరిగే బోనాల (Bonala) జాతరకు చాలా ప్రత్యకత ఉంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే ఈ పండుగ సందర్భంగా జరుపుకుంటున్నారు. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహిస్తోంది.బోనాల ఉత్సవంలో భాగంగా మహిళలు పసుపు, కుంకుమలతో అలంకరించబడిన బోనాలను తలపై తీసుకెళ్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించటం ఈ పండుగ ప్రధాన ఘట్టం.

రాకపోకలకు అంతరాయం
మహిళలు తలపై బోనంతో ఊరేగుతూ, డప్పులు, పోతురాజులు, ఫోక్ ఆర్టిస్టుల మధ్య సాగిన వీధి ఊరేగింపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లను ప్రభుత్వం, పోలీసు విభాగాలు సమర్థంగా నిర్వహించాయి. రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ (Traffic) ను మళ్లించడం, భద్రత కోసం సుమారు 2,500 మంది పోలీసులను నియమించడం జరిగింది.భక్తులు తామిచ్చే బోనాన్ని ఎంతో నమ్మకంతో, శ్రద్ధతో సమర్పిస్తారు. అది వారి కుటుంబ సంక్షేమానికి, ఆరోగ్యానికి, శాంతి భద్రతలకు సూచనగా భావిస్తారు.ఈ ఏడాది బోనాల పండుగ మరింత ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో నిండుగా జరుగుతోంది.
బోనాల పండుగ ప్రత్యేకత ఏమిటి?
బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుపుకునే హిందూ సంప్రదాయ పండుగ. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో ఈ పండుగ జరుపుకుంటారు.
బోనాల పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?
బోనాల పండుగ శాస్త్రం, సంప్రదాయాల కలయికగా పరిగణించబడుతుంది. మాన్సూన్ కాలంలో కలుషితమైన నీరు, రోగాలు, వ్యాధుల వ్యాప్తి పెరుగుతాయి. అలాంటి సమయంలో చల్లబడే నీటిని శుద్ధి చేయటానికి క్లోరినేషన్ చేసే విధంగా, బోనాల పండుగలో తర్మెరిక్ (పసుపు) వినియోగం కూడా శాస్త్రీయంగా చాలా ముఖ్యమైనది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి