జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించిన విచారణలో విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవడమే ప్రధాన కారణమని పేర్కొంది. రన్వే మీద ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్లకు ఫ్యూయల్ సరఫరా ఆగిపోవడంతో విమానం నియంత్రణ కోల్పోయినట్లు స్పష్టం చేసింది.
పైలట్ల మధ్య సంభాషనలో కీలక సమాచారం
కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ద్వారా వచ్చిన వివరాల్లో ఒక పైలట్ మరో పైలట్ను “ఎందుకు కటాఫ్ చేశావ్?” అని ప్రశ్నించగా, “నాకేమీ తెలీదు, నేను అలా చేయలేదు” అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ సంభాషన ప్రకారం ప్రమాదం అనుకోకుండా జరిగిందని భావిస్తున్నారు. పైలట్ల అనుభవంపై ఇంకా పరిశీలన కొనసాగుతుందని AAIB తెలిపింది.
ఇంజిన్లను భద్రపరిచిన అధికారులు
ప్రమాదం అనంతరం విమానం ఇంజిన్లను అహ్మదాబాద్ విమానాశ్రయంలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి ఫోరెన్సిక్ విశ్లేషణ అనంతరం తుది నివేదిక విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో విమానాశ్రయ భద్రతా ప్రమాణాలపై కూడా పునర్విమర్శ జరుగుతోంది. ఈ ఘటనపై ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, ఎయిర్ ఇండియా తరఫున ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టత ఇచ్చారు.
Read Also : Praksh Raj : పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్ర విమర్శలు